ree Darshan Tokens | అలిపిరికి మారిన టోకెన్ల కేంద్రం
x

ree Darshan Tokens | అలిపిరికి మారిన టోకెన్ల కేంద్రం

కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి రాగానే ఈ కేంద్రాన్ని శ్రీనివాసమంగాపురం ఆలయంలో టీటీడీ ఏర్పాటు చేయనుంది.


శ్రీవారిమెట్టు మార్గం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేసే ప్రక్రియ అలిపిరిలో ప్రారంభమైంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి ఇక్కడ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ టోకెన్లు తీసుకునే యాత్రికులు శ్రీవారి మెట్టు మార్గంలో స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ీటీటీడీ అధికారులతో కలసి శుక్రవారం రాత్రి పరిశీలించారు.


శ్రీనివాసమంగాపురం వద్ద ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ టోకెన్లు జారీ చేసే కేంద్రాన్ని మార్చడానికి టీటీడీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయం కూడా భారత పురావస్తు శాఖ (ASI) పరిధిలో ఉంది. టీటీడీ ఇక్కడ ఎలాంటి పని చేయాలన్నా, ఆర్కియాలజీ డిపార్టుమెంట్ అనుమతి తప్పనిసరి.
శ్రీవారి మెట్టు వద్ద ఉన్న తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని శ్రీనివాసమంగాపురం ఆలయం వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుమతి దొరకని కారణంగా, తాత్కాలికంగా ఆ కేంద్రాన్ని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు.
"ఇక్కడ టోకెన్ల జారీ కేంద్రం ఏర్పాటు చేయడంపై యాత్రికుల నుంచి స్పందన బాగుంది" అని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
"శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్లు ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI) అనుమతి ఇంకా రాలేదు" అని వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చామన్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ ఎస్ డి టోకెన్లను జారీ చేసే మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఒకే చోట చాలా కాలంగా ఉండడం వల్ల ఇక్కడ నుండి జారీ చేస్తున్నామన్నారు.
నాలుగు కౌంటర్ల ఏర్పాటు

శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లే యాత్రికుల కోసం భూదేవి కాంప్లెక్స్ లో నాలుగు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి శ్రీవారిమెట్టుకు రవాణా వ్యవస్థ కూడా ఉందని, బస్ స్టాండ్ కూడా అలిపిరిలోనే ఉందన్నారు. కాబట్టి భక్తులు శ్రీవారి మెట్టు చేరుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు.
భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవా వాలంటీర్లతో పాటు పరిపాలనా, నిఘా, అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా డీడీ టోకెన్లను జారీ చేయడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఆయన వెంట జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీ ఎస్ఓ కె.వి. మురళీకృష్ణ, అధికారులు ఉన్నారు.
Read More
Next Story