Tirumala | శ్రీవారి కొలువులో వేద ఘోషకు మంగళం?
x
తిరుమల:శ్రీవేంకటేశ్వరస్వామి వాహన సేవ ముందు వేదపారాయణ విద్యార్థులు (ఫైల్)

Tirumala | శ్రీవారి కొలువులో వేద ఘోషకు మంగళం?

తిరుమలలో ఘోరమైన అవచారం జరుగుతోందని వైసీపీ ఆరోపించింది. పండితులను తనిఖీల పేరుతో అవమానిస్తున్నారు.


తిరుమల దేవ దేవుని ఆలయంలో అపచారం జరపడానికి ఒక అధికారి ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చేర్మన్ బి. కరుణాకరరెడ్డి ఆరోపించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రక్షాళన అని చెప్పిన వాళ్ళు, వేద పారాయణం నిలిపి వేయాలని ఆలోచన చేయడం వెనుక సీఎం ఎన్. చంద్రబాబు అనుమతితోనే జరిగి ఉంటుందనే సందేహం వ్యక్తం చేశారు. లేకుండా జరిగిందా

తిరుమల శ్రీవారి సన్నిధి, ఉత్సవాల్లో చర్ముఖ బ్రహ్మ, నాలుగు వేదాలు చదువుతారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆగమశాస్త్రాన్ని ఆచరించే తిరుమల క్షేత్రంలో తరతరాలుగా వేదంతో శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో, ఉత్సవాల సందర్భంగా వేదాలతో కీర్తించడం పై తిరుమలలో ఓ ఉన్నతాధికారి అభ్యంతరం చెప్పారు. అని భూమన కరుణాకరరెడ్డి శుక్రవారం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి మీడియా సమావేశంలో ఆరోపించారు.

"తిరుమల క్షేత్రంలో వేదఘోష వినపడాలని స్కంద పురాణంలో స్పష్టంగా ఉంది" అని కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. అయితే,
"వేదం ఎందుకు? ఎవరికి అర్ధం అవుతుంది. ఓం నమో వెంకటేశాయ అంటే చాలు" అని ఆ అధికారి హేళనగా మాట్లాడడం ద్వారా వేద పండితులను అవమానించారని కరుణాకరరెడ్డి చెప్పారు. కొందరు వేదపండితులు తనతో మాట్లాడుతూ,

"వేదం వద్దంటున్నారు. గోవింద అటే చాలంటున్నారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో నఖశిఖ పర్యంతం తనిఖీ చేస్తూ, అవమానిస్తున్నారు" అని వేద పండితులు కొందరు తీవ్రంగా కలత చెందారని కరుణాకరరెడ్డి వెల్లడించారు. వేల సంవత్సరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయానికి స్వస్వి చెప్పించాలని ఆ ఉన్నతాధికారి ప్రయత్నిండం అనేది సనాతన ధర్మానికి అడ్డుపడడమే అని కరుణాకరరెడ్డి అభివర్ణించారు.
వేదం బదులు..
శ్రీవేంకటేశ్వరస్వామి వారి వాహన సేవలు, ఆలయంలో స్వామివారి కొలువులో కూడా పారాయణం జరుగుతుంది. ఇది యాత్రికులకు అర్థం కావడం లేదు. వేద పండితులు ఓం నమో వేంకటేశాయ అని అని నినదిస్తే చాలు అని చెప్పడం దారుణం అని కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు.
"చర్ముఖ బ్రహ్మ, నాలుగు వేదాలు చదువుతారు. వేదం అంటే బ్రహ్మదేవుని వాక్కు. తిరుమలలో ప్రతి ఉత్సవాలు, సేవలకు నిరంతరం వేదం పఠిస్తారు. వేదాలకు ఉన్న ప్రాశస్త్యం ఇది" అని ఆయన గుర్తు చేశారు.
"తిరుమలలో ఆ అధికారి అధికార గర్వంతో ఉన్నారు" అని నిరసన వ్యక్తం చేశారు.
120 ఏళ్లుగా వేద పాఠశాల
టిటిడిలో ప్రతి కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. వేదాలతో ముడిపడి ఉన్న పూజాది కార్యక్రమాలకు వేద పండితులను తయారు చేయడానికి 120 ఏళ్లుగా వేద పాఠశాల నిర్వహిస్తున్న విషయాన్ని కూడా భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేదం ప్రాధాన్యతను గుర్తించడం వల్లే టీటీడీ పాఠశాలల సంఖ్య ఆరుకు పెంచిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యకే పరిమతం కాకుండా, దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వేద విశ్వవిద్యాలయాన్ని కూడా తిరుపతిలో ఏర్పాటు చేశారన్నారు. టీటీడీలో వేద పారాయణం చేయడానికి 700 పోస్టులు మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రభుత్వంలోనే మంజూరు చేశారన్నారు.
కూటమి నిర్లక్ష్యం
ప్రతీకార చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ కూటమి వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను పున:సమీక్షించడానికే ప్రాధాన్యత ఇస్తోందని కరుణాకరరెడ్డి ఆరోపించారు. అందుకు సాక్ష్యం
"గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 700 వేదపారాయణ పోస్టులను పట్టించుకోలేదు" అని కరుణాకరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, శ్రీవారి ఆలయంలో 56 మంది వేద పారాయణదారులు ఉన్నారు. వీరిలో 26 మంది రిటైర్డ్ కావడంతో ఆ ఖాళీలు కూడా భర్తీ చేయలేదని వివరించారు.
ప్రయాణికుల తరహాలో తనిఖీ
ఆలయంలోకి వెళ్లే సమయంలో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే ఉన్నతాధికారి ఆదేశంతో ప్రధాన అర్చకులతో సహా, మిగతా అర్చకులను ఘోరంగా అవమానిస్తున్నారని కరుణాకరరెడ్డి ఆరోపించారు. విమానాశ్రయాల వద్ద ప్రయాణికులను తనిఖీకి ఏమాత్రం తీసిపోవడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగు కుటుంబాలకు చెందిన ప్రధాన అర్చకులు తీవ్రంగా కలత చెందుతున్న విషయాన్ని ఆయన వివరించారు.
తిరుమలలోని 13 పీఠాల్లో హోమం, అన్నదానం చేయకుండా ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వడంపై కొందరు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)కు కూడా ఫిర్యాదు చేశారని కరుణాకరరెడ్డి వివరించారు. పీఠాధిపతులపై ఎందకు స్వారీ చేయాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు.
Read More
Next Story