
తిరుమల:క్రీ.శ 614 నాటి విగ్రహ ఆవిర్భావ వేడుక
శ్రీవారి సన్నిధిలో భోగశ్రీనివాసుడిని సహస్రా శీర్ష పురుషుడిగా పరిగణిస్తారు. ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించడ వెనుక నేపథ్యం ఏమిటి?
తిరుమల అనగానే కళ్లముందు కదలాడేది శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు. ఆ విగ్రహం పాదాల చెంత కనిపించే మరో చిన్న విగ్రహమే భోగశ్రీనివాసుడు. ఈ విగ్రహానికి రాత్రి పవళింపుసేవ, వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించడం ఆనవాయితీ. వార్షిక ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఆ భోగశ్రీనివాసుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
భోగశ్రీనివాసమూర్తి విగ్రహం (ఫైల్)
తిరుమల శ్రీవారి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణం. ఈ క్రేత్రంలో నిర్వహించే ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఆ కోవలోనే.. శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించారు అనేది చారిత్రక నేపథ్య కథనం. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ రోజును పురస్కరించుకుని ఆలయంలో భోగశ్రీనివాసుడికి ఆదివారం ఉదయం ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.
కలశాలతో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, ఆలయప్రధాన అర్చకుల్లో ఒకరు వేణుగోపాల దీక్షితులుతో కలిసి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి చేరుకున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు, శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీవిష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.
మూలవిరాట్టుతో అనుసంధానం..