ఢిల్లీ అధికారే మళ్లీ తిరుమల జేఈఓ
x

ఢిల్లీ అధికారే మళ్లీ తిరుమల జేఈఓ

తిరుమల జేఈఓగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఢిల్లీ అధికారిని నియమించడానికి మొగ్గు చూపింది. డెప్యూటేషన్ పై తీసుకువస్తున్న ఆ అధికారి నియామకానికి ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలింది.


టీడీపీ కూటమి కూడా తిరుమలలో ఐఆర్ఎస్ అధికారిని జేఈఓగా నియమించనుంది. ఇందుకు మాజీ అదనపు ఈఓ ఏవీ. ధర్మారెడ్డి అర్హతను ప్రశ్నిస్తూ, దాఖలైన పిటిషన్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉపయోగపడినట్లు కనిపిస్తోంది. నాన్ ఐఏఎస్ అధికారుల్లో తిరుమలకు జేఈఓగా ఈయన రెండో అధికారి అవుతారు.

టీటీడీ తిరుమల జేఈఓగా ఐఆర్ఎస్ సీహెచ్. వెంకయ్యచౌదరిని నియమించడం దాదాపు ఖరారైంది. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన చౌదరి విజయవాడ కమిషనర్ గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వినతితో ఆయనను డెప్యూటేషన్ పై పంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈఓ)గా ఆయనను నియమిస్తూ, ఉత్తర్వులు జారీ కావడమే తరువాయి. గతంలో వెంకయ్య చౌదరి ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, ఎండీగా కూడా పనిచేశారు. ఆయన నియామకంలో సామాజికవర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అస్మదీయుడైన కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఏవీ. ధర్మారెడ్డిని డిప్యూటేషన్ పై తిరుమల జేఈఓగా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా .. మూడేళ్ల పాటు వెంకయ్య చౌదరి సేవలను డిప్యూటేషన్ పై వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఐఏఎస్ హోదాకు సమానమైన కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని అధికారులను నియమించుకోవచ్చని టీటీడీ అదనపు మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి అర్హతపై దాఖలైన పిటిషన్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వెసులుబాటు కల్పించింది

"తిరుమల పవిత్రత కాపాడుతా. పాలనలో ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తా" అని
సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అ మేరకు టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమించారు. ఆయన టీటీడీలో ప్రధానంగా తిరుమలలో ప్రక్షాళన దిశగా సమీక్షలతో నిత్యం బిజీగా ఉంటున్నారు.
"సామన్య యాత్రకులకు ఇబ్బంది లేకుండా చేస్తానంటూ" ఆయన చర్యలు తీసుకున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడే భక్తుల కోసం ప్రత్యేకంగా డిప్యటీ ఈఓ స్ధాయి అధికారి, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆ చర్యలేవీ ప్రతిఫలించలేదని గత మూడు రోజులుగా తిరుమలలో కిలోమీటర్ల కొద్దీ బారులుదీరుతున్న యాత్రికుల సంఖ్య చెప్పకనే చెబుతోంది.
తిరుమలకు ఐఆర్ఎస్ అధికారి
ఇదిలావుండగా, తిరుమల జేఈఓగా "తన సామాజికవర్గానికి చెందిన అధికారి వెంకయ్య నాయుడుని నియమించడానికే" సీఎం ఎన్. చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ కాలంలో తిరుమలలో రక్షణ శాఖలో పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఏవీ. ధర్మారెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆ తరువాత అదనపు ఈఓగా పనిచేసిన కాలంలో శ్రీవాణి ట్రస్ట్, సివిల్ పనులకు భారీగా నిధుల కేటాయించడానికి చేసిన తీర్మానాలకు ఏకపక్షంగా తలఊపడం, సేవా టికెట్ల మంజూరులో పక్షపాతం చూపించడం, మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలకు మాత్రమే మంజూరు చేయడం వంటి అంశాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారంలో లేనప్పుడు టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ నేతలే కాకుండా, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు కూడా అనేక ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారం ఇంకా తిరుమలలో రేకెత్తిన మంటలు ఇంకా ఆరలేదు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ విచారణ సాగుతోంది.
అనుకూలించిన తీర్పు
ఇదిలాండగా, ఐఏఎస్ హోదా లేని అధికారులను నియమించే ప్రక్రియకు మాజీ అదనపు ఈఓ ఏవీ. ధర్మారెడ్డి వల్ల మార్గం సుగుమం అయినట్లు కనిపిస్తోంది. "ఏవీ. ధర్మారెడ్డి నియామకాన్నితిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. 1991 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ హోం శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇది ఏపీలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాతో సమానమని కోర్టుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం 107 ప్రకారం ఏపీలో జిల్లా కలెక్టర్ లేదా ఆ హోదాకు సమానమైన వారు అర్హులనే వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పిటీషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ధర్మారెడ్డి నియామకానికి క్లీన్ చిట్ లభించింది.
సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించే వెంకయ్య చౌదరి ఎలాంటి సంస్కరణలు అమలు చేస్తారనేది వేచిచూడాలి.
Read More
Next Story