
నెల్లూరు జిల్లా ఆత్మకూరు గిరిజన కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం ఎన్. చంద్రబాబు
సైకిల్ తాత ధ్యాంక్యూ... నువ్వు గుర్తుంటావులే పాపా..
ఓ బాలిక మాటలకు సీఎం మురిసిపోయారు. ఆ గిరిజన కుటుంబానికి భరోసా ఇచ్చారు. 'పేదల సేవ'లో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పింఛన్లు పంపిణీ చేశారు.
సామాజిక పింఛన్లు పంపిణీ చేయడానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఓ కుటుంబంతో ఆయన మమేకం అయ్యారు. ఐదేళ్ల బాలిక చైత్ర చెబుతున్న మాటలు విని, సీఎం చంద్రబాబు మురిసిపోయారు. అనంతరం గిరిజనులు కోరిన వెంటనే సెల్ఫీలు దిగడం, సమస్యలపై ప్రజల నుంచి కూడా వినతిపత్రాలు స్వీకరించారు.
పేదల సేవలో...
జనంలోకి వెళుతున్న సీఎం ఎన్. చంద్రబాబు తన పంథా మార్చిన విషయం ఈ పాటికే అనేక పర్యటనల్లో చాటుకున్నారు. "పేదల సేవలో" కార్యక్రమం పేరిట సాగిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం గిరిజనకాలనీలో గురువారం మధ్యాహ్నం నుంచి పర్యటిస్తున్నారు. ఆయన వెంట మంత్రి, స్థానిక ఎమ్మేల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు.
మురిసిన గిరిజన కుటుంబం
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు పాలెం గిరిజన కాలనీకి వచ్చారు. గిరిజన దంపతులు అంకోజీ, సుమ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అంకోజీ కూతురు సుస్మితకు వితంతు పింఛన్ సీఎం చంద్రబాబు అందించారు. అంతకుముందు ఆ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారి కుటుంబ విషయాలు తెలుసుకోవడంతో పాటు జీవన విధానాన్ని పరిశీలించారు.
పాప తల్లి సుస్మిత ఈయన ఎవరు అని ప్రశ్నించగానే సీఎం చంద్రబాబునాయుడు అని చెప్పగానే పకపకా నవ్వారు.
"చిన్న నాటి నుంచి మీ ఫోటో చూస్తే, చాలు సైకిల్ తాత అటుంది" అని చైత్ర తల్లి సుస్మిత చెప్పగానే, అవునా, నువ్వు నాకు బాగా గుర్తిండిపోతావు. మంచి భవిష్యత్త ఇస్తాలే అని చైత్రను ఆశీర్వదించిన చంద్రబాబు, వారందరి కోరికతో గ్రూప ఫొటో దిగారు.
అంతకుముందు గిరిజన కుటుంబం వివరాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. సుస్మిత తండ్రి మాట్లాడుతూ, నేను బేల్దారి పనుల ఆధారంగా జీవిస్తూ, కొడుకు, కూతురిని చదివించాను అని వివరించారు.
"ఆధునిక పరికరాలు వచ్చాయి కదా. ఇంకా శరీర కష్టంతోనే జీవిస్తున్నారా? అని సీఎం చంద్రబాబు వారిని ప్రశ్నించారు.
"మీరు పనులు చేసుకుని, యంత్రాలు అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. వారు కోరితో యంత్రాలు మంజూరు చేయించాలనే తన అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు అడిగిన విధానం వారికి అర్థం కాలేదు. అయినా పక్కనే ఉన్న కలెక్టర్కు "ఈ కుటుంబానికి అవసరమైన పరికరాలు సబ్సిడీతో మంజూరు చేయండి" అని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
చలించిన సీఎం
ఆ కుటుంబంలోని వితంతువు సుస్మిత మాటలు విని సీఎం చంద్రబాబు చలించిపోయారు.
"నేను టీటీసీ చేశాను. పెళ్లి అయింది. ప్రశాంతంగా జీవితం సాగుతుండగా, గర్భిణిగా ఉన్నప్పుడే, నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు" అని సుస్మిత చెప్పగానే సీఎం చంద్రబాబు బాధతో నిట్టూర్చారు.
"నాకు వస్తున్న వితంతు పింఛన్ లో వెయ్యి రూపాయలు కూతరు చైత్ర పేరిట సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఎఫ్డీ చేస్తున్నా, నాకు ఉద్యోగ అవకాశం కల్పించండి" అని సుస్మిత వేడుకుంది.
స్పందించిన సీఎం చంద్రబాబు డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి మెరుగైన శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోండి అని పక్కనే ఉన్న కలెక్టర్ ఆనంద్ ను ఆదేశించారు.
సుస్మిత కూతురు చైత్రకు మంచి గురుకుల పాఠశాలలో చేర్పించి, ఆ పాప మంచిచెడ్డలపై పర్యవేక్షించండి అని కూడా సూచించారు.
ఐటీఐ చదివిన సుస్మిత తమ్ముడికి డ్రోన్ సబ్సిడీలో మంజూరు చేయాలని కూడా ఆదేశించిన సీఎం చంద్రబాబు ఈ వసతులతో జీవన ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. ఆ డ్రోన్ వ్యవసాయ శాఖ ద్వారా మంజూరు చేయించి, పనులు కల్పించాలని సూచించారు.
అనంతరం గిరిజనకాలనీ వీధుల్లో పర్యటిస్తూ, ప్రజలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సమస్యలపై కూడా వినతిపత్రాలు స్వీకరించారు.
Next Story