శ్రీనివాసుడికి వెండి కాసులహారం
x

శ్రీనివాసుడికి వెండి కాసులహారం

తిరుచానూరులో తిరుపతి యాత్రికుల కానుక


తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీశ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన యాత్రికులు 24 వెండి కాసులతో ఉన్న వెండి హారం కానుకగా సోమవారం సమర్పించారు. గండపేరుండంతో వెండి కాసులహారం తయారు చేయించారు.


తిరుపతికి చెందిన ఎన్. నిత్యశ్రీ దంపతులు సోమవారం ఉదయం స్వామివారికి 24 వెండి కాసుల హారంను బహుకరించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులుకు కాసులహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, శ్రీహరి, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారికి కానుక సమర్పించిన దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందించారు.

Read More
Next Story