Operation Sindhur |కల్లి తండకు వీరజవాన్ పేరు..
x
కల్లి తండలో వీరజవాన్ మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి సవితమ్మ

Operation Sindhur |కల్లి తండకు వీరజవాన్ పేరు..

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వీరజవాన్ తల్లిదండ్రులకు మంత్రి సవితమ్మ రూ. 50 లక్షల చెక్కుఅందించారు.


ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం చెందిన మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్ర బిసి సంక్షేమం, జౌళి, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి ఎస్. సవితమ్మ సోమవారం నాయక్ తల్లిదండ్రులకు సోమవారం అందించారు.

గోరంట్ల మండలం కల్లి నాయక్ తండకు సోమవారం ఉదయం వెళ్లిన మంత్రి సవితమ్మ వీరజవాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఐదెకరాలు వ్యవసాయ భూమి, ఆరు సెంట్ల ఇంటి స్థలం పత్రాలు నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ కు అందించారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు వీర జవాన్ స్వగ్రామమైన కల్లి తడాకు వీరజవాన్ పేరు పెట్టడానికి చర్యలు చేపట్టామన్నారు.


ఆపరేషన్ సింధూర్ లో కాశ్మీర్ వద్ద మురళీనాయక్ వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయం కల్లి తండాకు తీసుకుని వచ్చిన తరువాత అధికార లాంఛనాలతో నిర్వహించిన నాయక్ అంత్యక్రియలకు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరై, నివాళులర్పించారు. ఆ సమయంలో

"నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఇంటి స్థలం, స్మారక స్థూపం నిర్మించడానికి చర్యలు తీసుకుంటాం" అని మంత్రులు పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రకటించారు.
ఆ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థికసాయం చెక్కును మంత్రి సవితమ్మ కల్లి నాయక్ తండకు వెళ్లి, వీరజవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ కు అందించారు. ఆమె ఇంకా ఏమి చెప్పారంటే..
విగ్రహం ఏర్పాటు
మురళీనాయక్ విగ్రహం ఏర్పాటు పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయని మంత్రి సవితమ్మ చెప్పారు. మురళీనాయక్ స్మారకార్థం రూ.14 లక్షల వ్యయంతో సమాధిని నిర్మించనున్నట్లు తెలిపారు. జవాన్ ఇంటి నుంచి సమాధి వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వీరజవాన్ మురళి నాయక్ సమాధి వద్దకు వెళ్లి, పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
"జవాన్ మురళి నాయక్ ప్రాణత్యాగం ఈ ప్రాంతానికి, జిల్లా, రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణం" అని నివాళులర్పించారు. మంత్రి వెంట పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, జిల్లా సైనిక్ సంక్షేమధికారి తిమ్మప్ప, డీఐపీఆర్వో వేణుగోపాలరెడ్డి ఉన్నారు.
Read More
Next Story