Pawan Kalyan | వీరజవాన్ కుటుంబానికి అండగా డిప్యూటీ సీఎం
x
అనంతపురం జిల్లా కల్లి తండాలో మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత (ఫైల్)

Pawan Kalyan | వీరజవాన్ కుటుంబానికి అండగా డిప్యూటీ సీఎం

ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం చెందిన మురళీ నాయక్ కుటుంబానికి జనసేన చీఫ్ రూ. 25 లక్షల చెక్కు అందించారు.


ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ తల్లి తండ్రులకు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ప్రకటించిన 25 లక్షల ఆర్థికసాయం చెక్కును అందించారు.

జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), నిమ్మక జయకృష్ణ (పాలకొండ) శనివారం ఉదయం పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లారు. వీరజవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ కు చెక్కు అందించారు.


ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ సైన్యంతో పోరాడుతూ, కల్లి తండాకు చెందిన మురళీనాయక్ వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చారు. వీరజవాన్ కుటుంబీకులను ఓదార్చే క్రమంలో, మురళీనాయక్ తన వీరాభిమాని అని తెలుసుకున్న పవన్ కల్యాణ్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన నుంచి వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు ఆర్థికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ మేరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కల్లి తండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులకు చెక్ అందించి ఓదార్చారు. జనసేన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తాము 25 లక్షల చెక్ ను శ్రీరాం నాయక్, జ్యోతి బాయి లకు అందించినట్లు వారు చెప్పారు. సీఎం ఎన్. చంద్రబాబు, మంత్రి నారా లోకేస్ ప్రభుత్వం తరుపున 50 లక్షలుయ 4ఆర్థిక సాయం ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇంటి జాగా త్వరలోనే మురళీ నాయక్ తల్లితండ్రులకు అధికారులు అందిస్తారని వారు తెలిపారు.

తండా పేరు మార్చండి...

మురళీ నాయక్ వాలీ బాల్ ఆటగాడని తమ తండాలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని మురళీ నాయక్ తల్లితండ్రులు ఎమ్మెల్యేలను కోరారు. తమ తండా పేరును మురళీ నాయక్ తండాగా మార్చడంతో పాటు రోడ్ల నిర్మించాలని కోరారు. అలాగే ఆర్చ్ కూడా నిర్మించి సహాయ పడాలని వారు ఎమ్మెల్యేలను కోరారు. మురళీ నాయక్ తల్లి తండ్రులు కోరిన అన్ని కోరికల్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల దృష్టికి తీసుకెళ్లి పరిస్కరిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.


వీరజవాన్ మురళీనాయక్ సమాధి వద్దకు జనసేన పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నిమ్మక జయకృష్ణ చేరుకున్నారు. మురళీనాయక్ చిత్రపటం వద్ద వారు నివాళులర్పించారు.


Read More
Next Story