మదనపల్లె:రెండు పల్లెల్లో చిచ్చు రేపిన ప్రేమ పంచాయితీ
x
ANNAMAYYA DIST: రామసముద్రం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు

మదనపల్లె:రెండు పల్లెల్లో చిచ్చు రేపిన 'ప్రేమ పంచాయితీ'

మదనపల్లె సమీపంలోని రామసముద్రం స్టేషన్ ను గ్రామాల ప్రజలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది.


ప్రేమ వ్యవహారం రెండు గ్రామాల మధ్య యుద్ధానికి దారి తీసింది. దీనికి తోడు రాజకీయం కూడా తోడుకావడం వల్ల అధికార పార్టీ మద్దతుదారులు రామసముద్రం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. దాడి నుంచి కాపాడేందుకు ఎస్ఐను స్టేషన్ లోపల ఉంచిన సిబ్బంది గేట్లకు తాళం వేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా రంగ ప్రదేశం చేశారు. అయినా, రామసముంద్రంలో ఉద్రిక్తత ఏర్పడినట్లు సమాచారం అందింది.


చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా) మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రామసముద్రం మండలం ఎగువపల్లెకు సమీపంలోని ఎర్రబోయినపల్లి మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీరాములపల్లెకు చెంది ఓ వ్యక్తితో ఎర్రబోయినపల్లెకు చెందిన ఓ వివాహిత వెళ్లిపోయింది. కర్ణాటకలో ఆమె ఉన్నట్లు సమాచారం. అక్కడికి వెళ్లి పంచాయితీ కూడా చేశారని తెలిసింది. ఆమె తిరిగి రావడానికి అంగీకరించని స్థితిలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైనట్లు ఓ కథనం.
"మా ఊరి మహిళ వెళ్లిపోవడానికి మీరే ఆస్కారం కల్పించారు" అని శ్రీరాములపల్లెకు చెందిన గ్రామస్తులతో ఎర్రబోయినపల్లె ప్రజలు గొడవపడిన సంఘటన 20 రోజుల కిందట జరిగింది. ఇందులో శ్రీరాములపల్లె వైసీపీకి, ఎర్రబోయినపల్లె ప్రజలు టీడీపీ మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అప్పట్లోనే రెండు గ్రామాల మధ్య సయోధ్య కుదర్చడానికి మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా రంగంలోకి దిగారు.
రామసముద్రం ఎస్సై రవికుమార్ సమక్షంలో రెండు గ్రామాల ప్రజలకు సర్ది చెప్పారు. ఆ గ్రామస్తులను రాజీ చేయడంతో పాటు మళ్ళీ గొడవలు పడకుండా బైండోవర్ కూడా చేశారు.
మార్గమధ్యలో దాడులు
స్టేషన్ నుంచి బయటికి వెళ్లిన తరువాత రెండు గ్రామాల ప్రజలు ఘర్షణ పడ్డారు. శ్రీరాములపల్లె మీదుగానే ఎర్రబోయినపల్లె ప్రజలు వెళ్లాలి. దీంతో శ్రీరాములపల్లె వద్దకు రాగానే ఎర్రబోయినపల్లెకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కుటుంబీలపై దాడికి దిగారని తెలిసింది. రెండు గ్రామాల ప్రజలను తీవ్రంగా దాడి చేసుకున్న ఘటనతో రెండువర్గాల్లో గాయపడ్డారు. దీంతో రెండు గ్రామాలకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు రామసముద్రం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏకపక్షం అంటూ.. స్టేషన్ ముట్టడి
ఓ ప్రేమ జంట కారణంగా ఎగువపల్లె, శ్రీరాములపల్లి ప్రజల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబోయినపల్లికు చెందిన ప్రజలు మంగళవారం భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్సై రవికుమార్ పై ఆగ్రహ వ్యక్తం చేశారు. స్టేషన్లోకి దూసుకుపోవడానికి చేసిన ప్రయత్నంతో రామసముద్రం మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం మూసి వేసి, ఎస్సై రవికుమార్ ను లోపల ఉంచిన సిబ్బంది, స్టేషన్ గేట్లు మూసేశారు. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా రంగంలోకి దిగారని తెలిసింది. దీనికి సంబంధించి వివరాలు తెలియాలి.
Read More
Next Story