కడపలో జరిగిన టీడీపీ మహానాడు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు, మౌలిక సదుపాయాలు కల్పించి, పెట్టుబడులు తెప్పించి, ఉపాధి కల్పన ద్వారా ఈ ప్రాంతాన్ని "ముత్యాల భూమి"గా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. హంద్రీ-నీవా నీటిపారుదల ప్రాజెక్టుకు ₹3,870 కోట్లు, రాయలసీమ స్టీల్ ప్లాంట్కు ₹4,500 కోట్లు మరియు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి కీలక ప్రకటనలు ఉన్నాయి.
కడపలో జరిగిన పార్టీ వార్షిక సమ్మేళనం మహానాడు ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.
"రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను వాడుకునే రోజులు ముగిశాయి" అని నాయుడు భారీ ప్రజా సభను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటించారు.
"రాయలసీమను రతనాలసీమ (ముత్యాల భూమి)గా మార్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది."
బుధవారం మరో రెండేళ్ల కాలానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఎన్ చంద్రబాబు నాయుడు, రాయలసీమను మొత్తం రాష్ట్రానికి ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే తన దార్శనికతను పునరుద్ఘాటించారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి నీటిపారుదల ప్రాజెక్టుకు ₹ 3,870 కోట్లు మరియు కడపలో నీటి సదుపాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో గాలేరు-నగరి ప్రాజెక్టుకు ₹ 1,000 కోట్లతో సహా ఈ ప్రాంతానికి అనేక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి చర్యలను ఆయన ప్రకటించారు.
ఇంకా, కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన జూన్ 12 లోపు ప్రారంభమవుతుందని నాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ₹4,500 కోట్ల పెట్టుబడిని తీసుకురావడానికి మరియు 3,500 ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును వేగవంతం చేస్తామని, కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఏమన్నారంటే..
కడప ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి సరిగ్గా పది రోజుల్లో టెంకాయ కొడతా అని సీఎం ఎన్. చంద్రబాబు కడప మహానాడు ముగింపు సభలో ప్రకటించారు. 2007 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సీఎం నాలుగుసార్లు టెంకాయలు కొట్టడం, భూమి పూజలు చేయడంతోనే సరిపోయింది. మినహా కడప ఉక్కు పరిశ్రమ పనులు మాత్రం ముందుకు పడలేదు.
కడపలో మూడు రోజుల మహానాడులో సీఎం ఎన్. చంద్రబాబు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో సుదీర్ఘకాలంగా రాజకీయ అస్త్రంగా మారిన కడప ఉక్కు ఫ్యాక్టరీ పనులు టెంకాయ కొట్టి పది రోజుల్లో ప్రారంభిస్తానని వెల్లడించారు. ఆ స్థలం ఎక్కడ అనేది మాత్రం చెప్పలేదు.
కంబాలపల్లె వద్ద సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు (ఫైల్)
2007 జూన్ 10 వ తేదీ దివంగత వైఎస్సార్ అంబవరం వద్ద కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు టెంకాయకొట్టి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అనేక రాజకీయ మలుపులు తిరిగిన నేపథ్యంలో కడప స్టీల్ పరిశ్రమ పనులు ముందుకుసాగలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తరువాత ఎన్. చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ ఆతరువాత
2018 గండికోటకు రిజర్వాయర్ ఎగువన కంబాలదిన్నె వద్ద సీఎం చంద్రబాబు మళ్లీ శంకుస్థాపన చేశారు. మినహా పనుల్లో పురోగతి లేదు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తన తండ్రి ఆశయం సాధిస్తానంటూ, డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లె వద్ద సీఎం వైఎస్. జగన్ శంకుస్థాపన చేశారు. తిరిగి మళ్ళీ..
2023లో అదే ప్రాంతంలో జగన్ భూమి పూజ చేసిన కడప ఉక్కు మాత్రం ఆంధ్రుల హక్కు కాలేకపోయింది. రాయలసీమ ప్రాంత ప్రజలకు తీరని కలగా మిగిలిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో..
ఉక్కు సంకల్పం నెరవేరుస్తాం..
కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడు ప్లీనరీలో కడప ఉక్కుపై సీఎం చంద్రబాబు ఆశలు రేకెత్తించారు. పది రోజుల్లో పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
"కడప ఉక్కు పరిశ్రమకు పునాదులు వేయడమే కానీ గత ప్రభుత్వంలో ముందడుగు వేయలేదు. ఈ బాధ్యత కూటమి సర్కారు తీసుకుంటుంది" అని ప్రకటించారు. మొదటి దశ పనులు 4,500 కోట్ల రూపాయలతో ప్రారంభించడానికి టెంకాయ కొడతా" అని వెల్లడించారు. రెండో దశలో కూడా అంతే మొత్తంతో పనులు పూర్తి చేస్తాం" అని స్పష్టం చేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బుజ్జా దశరథరామిరెడ్డి స్పందించారు. ఈ ప్రాంతంలో సామెతను ప్రస్తావించారు.
"కోడలు మగ పిల్లవాడిని ఉంటానంటే అత్త వద్దంటుందా? సీఎం చంద్రబాబు పది రోజుల్లో నిర్మాణం మొదలు పెడతానంటే నేను వద్దంటానా?" అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మూడు టెంకాయలు కొట్టారు. ఈ టెంకాయ ఫలవంతం అవుతుందని ఆశిద్దాం .." అని బొజ్జా దశరథరామిరెడ్డి సందేహాస్పదమైన ఆశ వ్యక్తం చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనులు చేపడతామని సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు. తద్వారా ఈ ప్రాంత ప్రజల ఆశలు సాకారం చేస్తామని ఆయన అన్నారు. ఆయన ఏమన్నారంటే..
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడం తోపాటు పారిశ్రామికంగా కూడా ఆదుకుంటామన్నారు. అందులో భాగంగానే,
"కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. రూ. 4,500 కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు పది రోజుల్లో చేపడతామని వెల్లడించారు. రెండో దశలో మరో 4,500 కోట్ల రూపాయలతో చేపట్టే విధంగా కార్యచరణ సిద్ధంగా ఉంది. ఈ ప్లాంట్ వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి" అని సీఎం చంద్రబాబు చెప్పారు.
దీనిపై ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ఏమన్నారంటే...
"కడప స్టీల్ ఏర్పాటుకు అన్నిరకాల ముడిసరుకులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. కేంద్రం వద్ద కూటమికి ఉన్న పలుకుబడి ఉపయోగించి, అన్ని అనుమతులు, పెట్టుబడులు సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి" అని తులసీరెడ్డి సూచించారు.
"కడప మహానాడు అనేది మహాగోడు, మహాబోరు" అని అభివర్ణించారు. ఆత్మస్తుతి, పరనింద మినహా మరేమీ లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
నిరాశే మిగిలింది..
"మహానాడు రాయలసీమలో నిర్వహించడం వల్ల ఈ ప్రాంతానికి వరాల జల్లులు కురుస్తాయని ఆశపడ్డ వారికి నిరాశే మిగిలింది" అని అనంతపురానికి చెందిన అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అధ్యక్షుడు కెవి రమణ అన్నారు.
"విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పరంగా నిర్మించాల్సిన కడప ఉక్కును సైతం జిందాల్ ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి నిరాశకు గురి చేశారు" అని రమణ వ్యాఖ్యానించారు.
పర్యాటకంతో ఉపాధి.. ఇదీ సీమ డిక్లరేషన్
రాయలసీమ డిక్లరేషన్ ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో ఆంధ్ర రాష్ర్ట కంఠసీమకు రాయలసీమ కారిడాడర్ ను ఆభరణంగా తీర్చిదిద్దే ప్రణాళికను వెల్లడించారు.
రాయలసీమలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా యువతకు మరింత ఉపాధి లభిస్తుందనేది ఆయన అభిప్రాయం. దీని కోసం ప్రపంచంలోనే గుర్తింపుపొందిన సీమలోని ఆలయాలను అనుసంధానం చేస్తాం. అందులో భాగంగానే గండికోటలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు ప్రకటించారు.
రాయలసీమలో ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించే తీరును ఆవిష్కరించారు. ఇందులో శ్రీశైలం నుంచి కాణిపాకం వరకు అంటే.. మధ్యలో శ్రీకాళహస్తి, తిరుమల, లేపాక్షి, కడప పెద్దదర్గా కారిడార్ గా అనుసంధానం చేసి, పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎప్పటిలోగో డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రకటించలేదు.
2027కి పోలవరం పూర్తి చేయడం ద్వారా అక్కడి నుంచి బనకచర్ల రిజర్వాయర్ కు నీటిని తరలించే ప్రక్రియ పూర్తి చేసి, రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు పారించడానికి లక్ష్యంగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. నదీజలాల అనుసంధానం ద్వారా చివరి ఆయకట్టుకు కూడా మేలు జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
"రాయలసీమలో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువలు వెడల్పు చేయడం ద్వారా చివరి ఆయకట్టు భూములకు నీరు పారించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికోసం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత వెచ్చించలేదని ఆయన వెల్లడించారు. వెలిగొండతో పాటు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఎంత మేరకు నిధులు కేటాయిస్తారనే మాట మాత్రం లేదు.
"రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటి లోగా పూర్తి చేస్తారో దశ దిశ లేదు.కానీ గోదావరి-బనకచర్ల ను తీసుకొస్తామని గొప్పలు చెప్పుకున్నారు" అని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అధ్యక్షుడు కెవి రమణ అభిప్రాయపడ్డారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పడకుండా, అభివృద్ధిని వికేంద్రీకరించాలని తీర్మానించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఏమన్నారంటే..
1. విశాఖ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం
టీసీఎస్. గూగుల్ సంస్థలు కలాపాలు ప్రారంభించనున్నాయి. ఈ నగరాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యం. దీనికోసం టీడీపీ కూటమి తీసుకున్న అన్ని చర్యలు ఫలించాయి.
2. స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి సహకారం సాధించడం.
3. ఇప్పటికే రూ.11,400 కోట్లు ఇచ్చింది.
4. త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.