యాత్రికుల అభిప్రాయాలతో మెరుగైన సేవలు అందిస్తా..
x
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కుతున్న ఈఓ అశోక్ కుమార్ సింఘాల్

యాత్రికుల అభిప్రాయాలతో మెరుగైన సేవలు అందిస్తా..

రెండోసారి అవకాశం బాధ్యత పెంచిందంటున్న టీటీడీ ఈఓ సింఘాల్


తిరుమలలో మరింతగా మెరుగైన సేవలు అందించడానికి యాత్రికుల అభిప్రాయాలే కీలకం అని ఈఓ అశోక్ కుమార్ సింఘాల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. యాత్రికులు అందించే సూచనలతో సంస్కరణలు అమలు చేయడానికి శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు.

"టీటీడీ ఈఓగా రెండోసారి అవకాశం రావడం తనపై మరింత బాధ్యత పెరిగింది" అని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
టీటీడీ ఈఓగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుంచి సంఘాల్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబెర్ సెక్రటరీ, ఎక్స్ ఆఫీసియో సభ్యుడిగా కూడా ప్రమాణం చేశారు. ఆయనతో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్న ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. కుడిపక్క బదిలీ అయిన శ్యామలరావు, ఎడమపక్క అదనపు ఈఓ వెంకయ్య చౌదరి

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
"2017 మే నెల నుంచి మొదటిసారి అవకాశం దక్కింది. 2020 అక్టోబర్ వరకు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చింది" అని చెప్పారు. గత సంవత్సరం నుంచి లడ్డు, అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపడడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
అభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ఈఓ అశోక్ కుమార్ సింఘాల్ తన అభిప్రాయ చెప్పారు. తద్వారా లోటుపాట్లు గుర్తించి మెరుగైన సేవలు అందించవచ్చన్నారు.
దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మర్యాదపూర్వక భేటీ
ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత అశోక్ కుమార్ సింఘాల్ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోను చైర్మన్ శాలువాతో సత్కరించారు. బాధ్యతలు అప్పగించిన తరువాత బదిలీ అయిన ఈఓ జే. శ్యామలరావు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల్లో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకుని రావడానికి అందరి సహకారం లభించిందన్నారు. 25 ఏళ్ల పాటు స్వామివారి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Read More
Next Story