Anantapur | వెంటాడి.. వేటాడి.. కాంగ్రెస్ నేత హత్య
x

Anantapur | వెంటాడి.. వేటాడి.. కాంగ్రెస్ నేత హత్య

అనంతపురం జిల్లాలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. టిప్పర్ తో ఢీకొట్టి చంపడంలో ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తోంది. రియల్ సెటిల్మెంట్లు ఉన్నట్లు కూడా సమాచారం


రాయలసీమలో మళ్లీ హత్య రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయా? అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.

గత రెండు నెలల కాలంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అధికార టిడిపి, కొలిచౌట్ల వైసిపి నాయకులు హత్యకు గురైన సంఘటనలతో భయాందోళన ప్రారంభమయ్యా యి. తాజాగా
అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీనాయకుడు లక్ష్మీ నారాయణ హత్య కు గురయ్యారు. ఈయన ఎంఆర్పిఎస్ (madiga reservation porata samiti) రాయలసీమ ప్రాంత అధ్యక్ష బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న దళిత నాయకుడు లక్ష్మీనారాయణ ఇన్నోవా కారులో వెళుతున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్లతో వెంటాడారు. గుంతకల్లు పట్టణం చిప్పగిరి బ్రిడ్జి వద్ద లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టారు. ఆ దాటికి కారు నుజ్జునుజుగా మారి రైల్వే బ్రిడ్జి కి సమీపంలో దిమ్మెను ఢీకొని పక్కకు పడిపోయింది.
రెక్కీ తో... వేటాడారు..

టిప్పర్ తో కారణం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్మీనారాయణ చిక్కుకుపోయారు. అయినా వదలని ప్రత్యర్థులు, ఇప్పల నుంచి కిందికి దూకి చేతులోని వెతకొడవల్లతో స్వైర విహారం చేస్తూ, దారుణంగా హత్య చేసినట్లు సమాచారం అందింది. లక్ష్మీనారాయణ హత్య చేయడం వెనక ప్రత్యర్థులు ముందస్తు ప్రణాళికతోనే వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ కు ప్రత్యర్థులు ఉన్నారంటూ, వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమ వ్యవహారాలకు అడ్డుగా ఉన్నాడని నెపంతోనే లక్ష్మీనారాయణ కదలికలపై దృష్టి సారించిన ప్రత్యర్ధులు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనతో గుంతకల్లు ప్రాంతం ఉలిక్కిపడింది.
'రియల్' వ్యవహారమేనా..
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దళిత నేత లక్ష్మీనారాయణ హత్య వెనక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సెటిల్మెంట్లా? లేక పాత ప్రతీకారాల నేపథ్యమా అనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. గుంతకల్లు పట్టణం చిప్పగిరీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ హత్య సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. గుంతకల్లు, ఆలూరు ప్రాంతాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో లక్ష్మీనారాయణకు కొందరితో వివాదాలు ఉన్నట్లు కూడా భావిస్తున్నారు.
భారీగా చేరుకున్న మద్దతుదారులు
కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు అనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ఆయన
మద్దతుదారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తగాయాలతో ప్రాణాలు కోల్పోయిన లక్ష్మీనారాయణ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"పాత కక్షల నేపథ్యంలోనే ఓ కుటుంబం హత్యకు స్కెచ్ వేశారు" అని ఎమ్మార్పీఎస్ మద్దతుదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనపై అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (Anantapur DCC president) వై. మధుసూదన్ రెడ్డి స్పందించారు.
"తమ పార్టీ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హతమార్చడం హేయమైన చర్య. నిందితులను కఠినంగా శిక్షించాలి" అని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. డబల్ ఇంజన్ సర్కార్ పాలనలో రోజుకో డబల్ మర్డర్ జరుగుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారును కొందరు టిప్పర్ తో ఢీ కొట్టి దారుణంగా హత్య చేయడం వెనక ఉన్న నిందితులను శిక్షించడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story