
ఆత్మకూరు ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu | 'తల్లికినందనం'పై సీఎం క్లారిటీ
బడులు తెరిచే నాటికి తల్లుల ఖాతాకు నగదు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి రాకముందు టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్-6 లో భాగంగా తల్లికినందనం పథకం పాఠశాలలు తెరిచేనాటికి అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం 'పేదల సేవ'లో కార్యక్రమంలో భాగంగా నారంపేట వద్ద గురువారం ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డీఎస్సీ పూర్తి చేయడంతో పాటు తల్లికివందనం పథకం అమలు చేసి తీరుతానని ఘంగాపథంగా చెప్పడం ద్వారా ఊహాగానాలకు తెరదించారు.
ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే, వారందరికీ రూ. 15 వేలు తల్లుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 30 వేలు, ముగ్గురు పిల్లలు ఉంటే రూ. 45 వేలు వారి ఖాతాలకు జమ చేస్తానని చెప్పారు. పాఠశాలలు తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా డీఎస్సీ పూర్తి చేయడం ద్వారా, ఎంపిక చేసిన ఉపాధ్యాయుల తో పాఠాలో బోధించడానికి సెలవులు పూర్తికాగానే బడికి వస్తారని కూడా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పింఛన్లు పంపిణీ చేశారు.
గత నెలలో జరిగిన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో తల్లికివందనం పథకం నగదు బదిలీ ఒకేసారా? దశలవారీగానే పంపిణీ చేయాలా అనేది ఆలోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని ఆసరాగా తీసుకున్న వైసీపీ నేతలు విమర్శలకు దిగారు. దీంతో టీడీపీ కూటమి జరగబోయే నష్టాన్ని గ్రహించినట్లు కనిపిస్తోంది. రోజుల వ్యవధిలోనే ఈ విమర్శలు, ఆరోపణలకు సీఎం సీఎం చంద్రబాబు ఆత్మకూరులో చేసిన ప్రకటనతో తెరదించారు.
2024 ఎన్నికల మేనిఫెస్టోలో టిడిపి కూటమి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలలో కూడా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకంపై విస్పష్టమైన ప్రకటన చేశారు.
ఊహలకు తెరదించిన సీఎం
తల్లికివందనం పథకంపై సీఎం ఎన్. చంద్రబాబు మీడియాతో పాటు ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణలకు తెరదించారు.
"ఈ ఏడాది పాఠశాలలు తెరిచే నాటికి తల్లుల ఖాతాకు నగదు జమ అవుతుంది" అని ప్రకటించారు. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూడా 9,507 కోట్ల రూపాయలు కేటాయించారు. తల్లికివందనలో ఒకే విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తున్నారు. ఆ మొత్తంలో కూడా గతంలా మాదిరే రూ. వెయ్యి కోత కూడా విధించమని విషయం సీఎం మాటలతో స్పష్టమైంది.
Next Story