నెల్లూరు నుంచి పారిశ్రామిక పార్కులకు నేడు పునాది
x

నెల్లూరు నుంచి పారిశ్రామిక పార్కులకు నేడు పునాది

రాష్ట్రంలో పారిశ్రామికపార్కుల ప్రారంభానికి సీఎం చంద్రబాబు నెల్లూరులో శ్రీకారం చుట్టనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకొన్ని గంటల్లో పర్యటించనున్నారు.


రాష్టంలో యువత ఉపాధి లక్ష్యంగా 14 ఎఫ్ఎఫ్సీలు, 25 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం ఎన్. చంద్రబాబు నెల్లూరు పర్యటనలో గురువారం శంకుస్థాపన చేయనున్నారు. కొన్నింటిని వర్చువల్ విధానంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

కార్మిక దినోత్సవం సందర్భంగా యువతకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పారిశ్రామిక పార్కులకు గురువారం మధ్యాహ్నం శ్రీకారం చుట్టనున్నారు. 2028 నాటికి రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా 15వేల ఎంఎస్ఎంఈ (Micro, Small, and Medium Enterprises ) యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల స్వయంగా పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేట పాళెం గిరిజన కాలనీలో పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి ఒకో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటున్న సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే మే నెల పింఛన్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నారంపేటలో ఏర్పాట్లు చేశారు.
ఎంఎస్ఎంఈ పార్కుకు శ్రీకారం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. పాళెంగిరిజన కాలనీలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ అనంతరం ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడడానికి ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేశారు. సీఎం ఎన్. చంద్రబాబు స్వయంగా ఈ పార్కను ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని మిగతా 50 పార్కులను అక్కడి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి వీలుగా నెల్లూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని 11 MSME పార్కులను ప్రారంభించనున్నారు. అందులో అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూర్, దర్శి, పుట్టపర్తి (కప్పలబండ)లో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం కానున్నాయి.
శంకుస్థాపనలు
శ్రీసత్య సాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలబం దాదులూరు, పెనుగొండ, కదిరి నియోజకవర్గం ముత్యాల చెరువు మడకశిరలో ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ పద్ధతిలో సీఎం ఎన్ చంద్రబాబు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టేనున్నారు.
ప్రజలతో ముఖాముఖి

ఈ కార్యక్రమాల అనంతరం ప్రజావేదికకు చేరుకునే సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడు గంటల వరకు ప్రజావేదిక నుంచి మాట్లాడడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.
మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 4.35 గంటల వరకు టీడీపీ నేతలు ప్రధానంగా కార్యకర్తలకు సమయం కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో తీసుకోవాల్సిన శ్రద్ధపై సూచనలు చేసే అవకాశం ఉంది. దీనికంటే ప్రధానంగా సీఎం చంద్రబాబు తాను పర్యటించే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గతానికి భిన్నంగా ఈసారి సీఎం అయిన తరువాత చంద్రబాబు అనుసరిస్తున్న పంథా ఇది. ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత సాయంత్రం4.40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం అవుతారు.
Read More
Next Story