
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం ఎన్. చంద్రబాబు, సీనియర్ టీడీపీ నేతలు
CM Chandrababu | లోకేష్ ఫార్ములా గేమ్ ఛేంజర్ కాబోతోందా..?
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లో నూతనత్వం తీసుకుని వస్తుంది. నా తెలుగు కుటుంబం కీలక మలుపు తిప్పుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కడప తెలుగుదేశం మహానాడు చేసిన తీర్మానాలు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ కాబోతున్నాయని సీఎం ఎన్ చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మూల సిద్ధాంతాల్లో కాస్త ముందడుగు వేసి నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకువచ్చిన "నా తెలుగు కుటుంబం" నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాలు రానున్న కాలంలో రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఓ గేమ్ చేంజర్ కాబోతున్నాయని చంద్రబాబు అభివర్ణించారు.
స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవబోతున్నదని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కడప మహానాడు వేదికపై నుంచి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సహా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
"ఎన్టీ రామారావు దార్శనిక నేత. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రకటించి" పార్టీని కూడా అలాగే నడిపించాలని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనలోనే టిడిపి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
టిడిపి మహానాడు రెండో రోజు బుధవారం ఉదయం ప్రతినిధుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,
"ఎన్టీఆర్ ఉత్తేజానికి నిలువుటద్దం. ఆయనను తలుచుకున్న, విగ్రహాన్ని చూసిన శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది" అని చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు టిడిపి ని స్థాపించిన తర్వాత అమలు చేసిన కార్యక్రమాలతో చరిత్ర సృష్టించారన్నారు. ఆ ఒరవడిని 43 ఏళ్లుగా కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల బ్లూ ప్రింట్ రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"నా తెలుగు కుటుంబం, లోకేష్ ఫార్ములా -6 లో తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, శ్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్త అధినేత" తీర్మానాలపై జరిగిన చర్చలకు టిడిపి జాతీయ అధ్యక్షుని హోదాలో సీఎం చంద్రబాబు ప్రతినిధుల నుంచి ఆమోదం తీసుకున్నారు.
ఈ అంశాలపై ఆయన మాట్లాడుతూ,
తెలుగుదేశం పార్టీకి కార్యకర్త సుప్రీం, హాయ్ కమాండ్ కూడా పని చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఎన్టీ రామారావు కాలం నుంచే తెలుగుదేశం పార్టీ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. జనాభా తమాషాలు అన్ని కులాలకు గౌరవం ఇవ్వడమే కాకుండా వారి నుంచి విశ్వాసం సంపాదించుకోవడానికి పార్టీలోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ పెద్దపీట వేసాం అని గుర్తు చేశారు. 1996లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నాంది పలికి, ఎన్నో అవరోధాలు అధిరోహించిన తర్వాత 2025 నాటికి అమలు చేయడానికి మార్గం సుగమం చేస్తామన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో మాల, మాదిగల మధ్య అంతరాలు లేకుండా జనాభా దామాషా పద్ధతిలో పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
సోషల్ రీ ఇంజినీరింగ్ వల్లే టిడిపిలో ఎస్సీలు, బీసీ నాయకులను పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్ తోపాటు అత్యున్నత పదవుల్లో ఆసీనులు కావడానికి అవకాశం కల్పించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విధానాన్ని ఇంకా సరళీకరించడం ద్వారా పార్టీలోనే కాకుండా సమాజంలో మరింత మార్పులు తీసుకురాడానికి ఫార్ములా సిక్స్ పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కడప మహానాడు దిక్సూచి
పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల అవసరాలను తీర్చడానికి విధానపరమైన మార్పులు తీసుకురావడానికి కడప మహానాడు దిక్సూచిలా చరిత్రలో నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
"పార్టీ కూడా నూతన నాయకత్వాన్ని కోరుకుంటుంది" అని సీఎం చంద్రబాబు చెప్పడం ద్వారా తన కొడుకు, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ కు క్లియరెన్స్ ఇచ్చినట్లు కనిపించింది. ఆ ఆరు అంశాలు, నా తెలుగు కుటుంబం కీలక మలుపు తిప్పుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కడప తెలుగుదేశం మహానాడు చేసిన తీర్మానాలు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ కాబోతున్నాయి అని సీఎం ఎన్ చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మూల సిద్ధాంతాల్లో కాస్త ముందడుగు వేసి నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకువచ్చిన "నా తెలుగు కుటుంబం" నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాలు రానున్న కాలంలో రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఓ గేమ్ చేంజర్ కాబోతున్నాయని చంద్రబాబు అభివర్ణించారు.
స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవబోతున్నదని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కడప మహానాడు వేదికపై నుంచి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సహా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
"ఎన్టీ రామారావు దార్శనిక నేత. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రకటించి" పార్టీని కూడా అలాగే నడిపించాలని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనలోనే టిడిపి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
టిడిపి మహానాడు రెండో రోజు బుధవారం ఉదయం ప్రతినిధుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,
" ఎన్టీఆర్ ఉత్తేజానికి నిలువుటద్దం. ఆయనను తలుచుకున్న, విగ్రహాన్ని చూసిన శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది" అని చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
రాఅభివృద్ధి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు టిడిపి ని స్థాపించిన తర్వాత అమలు చేసిన కార్యక్రమాలతో చరిత్ర సృష్టించారన్నారు. ఆ ఒరవడిని 43 ఏళ్లుగా కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల బ్లూ ప్రింట్ రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"నా తెలుగు కుటుంబం, లోకేష్ ఫార్ములా -6 లో తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, శ్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్త అధినేత" తీర్మానాలపై జరిగిన చర్చలకు టిడిపి జాతీయ అధ్యక్షుని హోదాలో సీఎం చంద్రబాబు ప్రతినిధుల నుంచి ఆమోదం తీసుకున్నారు.
ఈ అంశాలపై ఆయన మాట్లాడుతూ,
తెలుగుదేశం పార్టీకి కార్యకర్త సుప్రీం, హాయ్ కమాండ్ కూడా పని చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఎన్టీ రామారావు కాలం నుంచే తెలుగుదేశం పార్టీ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. జనాభా తమాషాలు అన్ని కులాలకు గౌరవం ఇవ్వడమే కాకుండా వారి నుంచి విశ్వాసం సంపాదించుకోవడానికి పార్టీలోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ పెద్దపీట వేసాం అని గుర్తు చేశారు. 1996లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నాంది పలికి, ఎన్నో అవరోధాలు అధిరోహించిన తర్వాత 2025 నాటికి అమలు చేయడానికి మార్గం సుగమం చేస్తామన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో మాల, మాదిగల మధ్య అంతరాలు లేకుండా జనాభా దామాషా పద్ధతిలో పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
సోషల్ రీ ఇంజనీరింగ్ వల్లే టిడిపిలో ఎస్సీలు, బీసీ నాయకులను పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్ తోపాటు అత్యున్నత పదవుల్లో ఆసీనులు కావడానికి అవకాశం కల్పించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విధానాన్ని ఇంకా సరళీకరించడం ద్వారా పార్టీలోనే కాకుండా సమాజంలో మరింత మార్పులు తీసుకురాడానికి ఫార్ములా సిక్స్ పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కడప మహానాడు దిక్సూచి
పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల అవసరాలను తీర్చడానికి విధానపరమైన మార్పులు తీసుకురావడానికి కడప మహానాడు దిక్సూచిలా చరిత్రలో నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
"పార్టీ కూడా నూతన నాయకత్వాన్ని కోరుకుంటుంది" అని సీఎం చంద్రబాబు చెప్పడం ద్వారా తన కొడుకు, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ కు క్లియరెన్స్ ఇచ్చినట్లు కనిపించింది.
Next Story