
చిత్తూరు: కళ్లేదుటే.. నీటిలో కలిసిన తమ్ముడి ప్రాణం
వి.కోట వద్ద ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు మరణించారు. వారిలో ఇద్దరు అన్నదమ్ములు.
వేసవి సెలవుల్లో పిల్లల ఈత సరదా ప్రాణం మీకు తెచ్చింది. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి. కోట వద్ద గురువారం మధ్యాహ్నం విషాధ ఘటన చోటుచేసుకుంది. చెరువులో నీట మునుగుతున్న ముగ్గురిలో తమ్ముడు జగన్ (9) కూడా ఉండడంతో ఆ దృశ్యం చూస్తున్న అన్న పూర్ణేష్ తల్లడిల్లాడు.
తమ్మూడు ముందుకు వెళ్లకు.. వెనక్కి వచ్చేయ్ అని కేకలు పెడుతున్నాడు. అప్పటికే బురదలో కూరుకుపోవడం గమనించిన పూర్ణేష్ గ్రామంలోకి పరుగులు తీశాడు. ఊర్లో విషయం తెలిసి చెరువు వద్దకు భారీగా చేరుకున్నారు. అప్పటికే మరణించిన ఇద్దరు పిల్లలను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. కొనఊపిరితో ఉన్న మరో బాలుడిని ఆస్పత్రికి తరలించినా, ఫలితం లేకుండా పోయిన విషాధ ఘటన ఇది.
వి.కోట మండలం మోట్లపల్లి వద్ద పూర్ణేష్ (11), జగన్ (9) అన్నదమ్ములు. నిఖిల్ (12) కుషాల్ (11) పెద్దనాన్న, చిన్నాన్న కొడుకులు. సెలవలు కావడంతో గ్రామం సమీపంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. పూర్ణేష్ మినహా మిగతా ముగ్గురు పిల్లలు నీటిలోకి దిగారు. కొద్దిసేపటికి వారంతా నీటిలో మునిగిపోతున్నట్లు గమనించిన ఒడ్డునే ఉన్న పూర్ణేష్ ప్రమాదాన్ని గ్రహించాడు. తాను ఎంతగా హెచ్చరిస్తున్నా, తమ్మడు జగన్ తోపాటు మిగతా ఇద్దరు పిల్లలు నిఖిల్, కుషాల్ వినిపించుకోకపోవడంతో పూర్ణేష్ ఆందోళనకు గురయ్యాడు. భయంతో కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వెళ్లి చెప్పాడంతో ఈ విషయం వెలుగుచూసింది.
ఈ విషయాన్ని వి. కోట సీఐ సోమశేఖర్ చెప్పారు.
"గ్రామం సమీపంలోని చెరువులో మోకాటి లోతు వరకే నీరు ఉంది. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. కేసు దర్యాప్తు చేస్తున్నాం" అని సీఐ సోమశేఖర్ చెప్పారు.
చెరువువద్దకు చేరుకున్న గ్రామస్తులు నీట మునుగుతున్న ముగ్గురు బాలురను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. వారిలో జగన్ ఇద్దరు మరణించినట్లు గుర్తించారు. మరో బాలుడిని ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు గుర్తించారని పోలీసులు తెలిపారు. చెరువుగట్టు వద్ద మరణించిన పిల్లల తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది. గ్రామంలో మూడె కుటుంబాల్లో విషాదం ఏర్పడింది.
Next Story