
పుట్టపర్తి విమానాశ్రయంలో పౌర రక్షణపై అవగాన కల్పిస్తున్న కమాండోలు
అనంతపురం: పుట్టపర్తిలో మోగిన సైరన్
విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఉగ్రదాడుల నుంచి రక్షణపై కమాండోలు అవగాహన కల్పించారు.
అది పుట్టపర్తి విమానాశ్రయం. అంతర్జాతీయంగా పేరు ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం. పోలీసులు, కమండోలు ప్రవేశం చేశారు. ఒక్కసారిగా సైరన్ మోగింది. ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కమాండోలు అక్కడి ప్రయాణికులను కాపాడడానికి రంగంలోకి దిగారు దిగారు. అక్కడి అధికారులు ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడులకు దిగితే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? వారిని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై భద్రతపరంగా బుధవారం శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
కాశ్మీర్ లోని పహల్గావ్ వద్ద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మరణ హోమంలో 26 మంది భారతీయులు ప్రాణాలు వదిలారు. దీనికి ప్రతీకార చర్యగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా మంగళవారం వేకుజామున సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసింది. దీంతో
దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం ద్వారా భద్రత సూత్రాలు పాటించడానికి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ చేతన్ ఎస్పీ వి.రత్న పుట్టపర్తి విమానాశ్రయంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ పర్యవేక్షించారు.
రాయలసీమలో తిరుమల, తిరుపతి తరువాత, రక్షణ పరంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు సమీపంలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (central industrial security force CISF) దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న
సాయిబాబా ప్రశాంతి నిలయానికి కేంద్రంగా ఉన్న పుట్టపర్తి లో కూడా కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు.
ప్రమాదం జరిగితే..
విమానాశ్రయంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏమి చేయాలి రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్, సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు.
భద్రతపై అవగాహన
ఉగ్రవాదులు దాడులుకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, వివిఐపి లకు ఎలాంటి రక్షణ కల్పించాలనే అంశాలను మార్క్ డ్రిల్ ద్వారా వివరించారు. దాడుల నేపథ్యంల ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఆంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు ఎలా తరలించాలి , బాంబులు అమర్చిన ప్రాంతాన్ని డాగ్స్ స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి అనే విషయాలపై మార్క్ డ్రిల్ నిర్వహించారు.
డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, ఆర్డీవో సువర్ణ, తాసిల్దార్ కళ్యాణ్ ,సిఐలు, సునీత, సురేష్,ఆర్ ఐ లు, మహేష్,వలి, ఎస్బిఎస్ఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తి ఆర్ఎస్ఐలు వీరన్న, వెంకటేశ్వర్లు,ప్రదీప్ సింగ్, అన్ని శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
"మాక్ డ్రిల్ వల్ల ప్రజలను మానసికంగా సంసిద్ధం చేయడం. ప్రమాదకర పరిస్థితులు తీసుకోవాల్సిన పద్ధతులపై అవగాహన పెరుగుతుంది" అని మాక్
డ్రిల్ పర్యవేక్షించిన సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు చేరడం. తమతో పాటు సమీపంలోని వారిని కూడా కాపాడేందుకు ఆస్కారం అంటుంది అని ఆమె తెలిపారు.
Next Story