పుట్టినరోజే ఆ మాజీ సిపాయికి నూరేళ్లు నిండాయే..
x
చిత్తూరు జాతీయ రహదారిపై తగలబడుతున్న కారు

పుట్టినరోజే ఆ మాజీ సిపాయికి నూరేళ్లు నిండాయే..

శ్రీవారి దర్శనానంతరం ఓ కుటుంబాన్ని చంద్రగిరి వద్ద ప్రమాదం వెంటాడింది. భార్యా, భార్త మరణించారు. వారి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.


పుట్టినరోజు కావడంతో శ్రీవారి దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరిన మాజీ సిపాయి సిద్ధయ్యకు నూరేళ్లు నిండాయి. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి, మంటలు చేలరేగడంతో ఆయన మరణించాడు. ఈ ప్రమాదంలో సిద్ధయ్య తోపాటు భార్య కూడా మరణించింది. ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.


ఈ ప్రమాదంలో కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ మంటలు, పొగధాటికి జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించాయి. సిద్ధయ్య గతంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రైవేట్ గన్ మెన్ గా పనిచేశారు. ప్రమాద సంఘటన వివరాలు ఇవి.

చిత్తూరు సమీపంలోని గుడిపాలకు చెందిన సిద్ధయ్యది ఆదివారం పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత వారంతా కారులో గుడిపాలకు బయలుదేరారు.
డివైడర్ ను ఢీకొని

చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, అదుపుతప్పని కారు డివైడర్ ను ఢీకొంది. వెంటనే కారు నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారికి రెండు పక్కలా వాహనాలు నిలిచిపోయాయి. మంటలు కారును చుట్టుముడుతుండడం, లోపలి నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. మంటలు చెలరేగుతున్నా, కారు నుంచి నలుగురినీ బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు.
ఆధార్ కార్డుతో..

కారులో చిక్కుకుని మరణించిన వ్యక్తిని బయటకు తీశారు. ఆయన వద్ద దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా సిద్ధయ్య అని గుర్తించారు. చంద్రిగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెంట అంగరక్షకుడిగా ఉన్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. సిద్ధయ్య తోపాటు ఆయన భార్య జ్యోతి, కొడుకు, కూతురిని బయటికి తీశారు. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా, జ్యోతి మార్గమధ్యలోనే మరణించగా, పిల్లలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story