శేషాచలంలోకి అమెరికా వడ్రింగి తేనెటీగ
x
తిరుమల శేషాచలం కొండలు (ఫైల్)

శేషాచలంలోకి అమెరికా వడ్రింగి తేనెటీగ

శేషాచలం అటవీ జీవవైవిద్య క్షేత్రం అరుదైన జీవులకు నిలయం. దీనిలోకి మరో అరుదైన మిత్రజీవి చేరింది. తూర్పు కనుమల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు.


తిరుమల శేషాచలం అడవుల్లో అరుదైన జీవి ప్రత్యక్షమైంది. ఉత్తర అమెరికాలో సంచరించే వడ్రంగి తేనెటీగ (Carpenter Bees) తిరుపతి పరిసరాల్లో కనిపించింది. రెండుసార్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Zoological Survey of India JSI ) శాస్ర్తవేత్తలు ఇప్పటికి 93 జీవాలను గుర్తించారు. తాజాగా కనుగొన్న వడ్రంగి తేనెటీగతో ఆ సంఖ్య 94కు చేరుతుందా? అనేది జీవశాస్ర్త నిపుణులు నిర్ధారించాల్సి ఉంది

తిరుపతిలోని మంచినీళ్ల గుంట సమీపంలోని శివాలయంలో ఆదివారం కనుగొన్నట్లు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయనికి చెందిన డాక్టర్ హరికృష్ణ పాకనాటి హరికృష్ణ తెలిపారు.

"ఈ వడ్రంగి తేనెటీగ మగ వ్యాలీ కార్పెంటర్ బీ (జైలోకోపా సోనోరినా) లేదా ట్రాపికల్ కార్పెంటర్ బీ (జైలోకోపా లాటిప్స్) జాతికి చెందింది" అని డాక్టర్ హరికృష్ణ చెప్పారు.
తిరుమల శేషాచలం అటవీప్రాంతం అరుదైన జీవులు, మొక్కలకు నిలయం అనేది చరిత్ర చెప్పే పాఠం. ఈ అడవుల నుంచి కూడా ఔషధ వనమూలికలను కూడా సేకరించడమే కాదు. వనాల పెంపకం కూడా చేస్తున్నారు. అరుదైన జంతువుల రక్షణకు కూడా ప్రత్యక శ్రద్ధ తీసుకుంటున్నారు. జీవశాస్ర్త నిపుణలు కూడా శేషాచలం అడవుల్లో సాగించిన పరిశోధనల ద్వారా వనమూలికలు, జంతువులను కూడా గుర్తించారు. ఈ అటవీప్రాంత బంగారు బల్లి, పునుగుపిల్లి వంటి అరుదైన జంతువులకు నిలయం. ఆ కోవలో మరో అరుదైన జీవి కనిపించి ఆశ్చర్య పరిచింది.
వడ్రింగి తేనెటీగ
చూడగానే ఆకట్టుకునే విధంగా కనిపించే వడ్రింగి తేనెటీగ తిరుపతికి సమీపంలోని మంచినీళ్లగుంట శివాలయంలో ప్రత్యక్షమైంది. ఇది ఈ ప్రదేశంలో ఉంటుందనే ఊహకు కూడా అందలేదని తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేసే డాక్టర్ పాకనాటి హరికృష్ణ చెప్పారు. దర్శనానికి వెళ్లి, ఆలయం నుంచి బయటికి వస్తుండగా..
"నేలపై ఈ వడ్రింగి తేనెటీగ మెల్లగా పాకుతూ రావడవం కనిపించింది" అని డాక్టర్ హరికృష్ణ చెప్పారు. వెంటనే ఆ ఈగ ఫొటోతో పాటు వీడియో తీశాను అని ఆయన తెలిపారు. ఈ ఈగలకు సంబంధించిన జీవనవిధానం ఎలా ఉంటుందనే విషయాలపై హరికృష్ణ ఏమంటున్నారంటే..
ఈ తేనెటీగల స్వభావం
వడ్రంగి తేనెటీగలు (Carpenter Bees) అనేవి చెక్కలో గూళ్లు చేసుకునే తేనెటీగలు. ఇవి సాధారణంగా చెక్కను కొరికి రంధ్రాలు చేస్తాయి, కాని చెక్కను తినవు. ఆడ వడ్రంగి తేనెటీగలు మాత్రమే కుట్టగలవు, కాని అవి సాధారణంగా రెచ్చగొట్టకపోతే కుట్టవు. చెట్ల కొమ్మలు, చెక్క కిరణాలు లేదా ఇతర చెక్క నిర్మాణాలలో గూళ్లు చేసుకుంటాయి. ఇవి ఒకే ద్వారం కలిగిన వృత్తాకార రంధ్రం చేస్తాయి, ఆ రంధ్రం లోపల సొరంగాలుగా విభజించుకొంటాయి. వడ్రంగి తేనెటీగలు తేనెను ఉత్పత్తి చేయవు. పువ్వుల నుంచి మకరందం, పుప్పొడిని సేకరిస్తాయి. వాటి లార్వా కోసం, అవి చెక్క బొరియలలో నిల్వ చేసిన "బీ బ్రెడ్" ను తింటాయి. ఆడ వడ్రంగి తేనెటీగలు మాత్రమే కుట్టగలవు, కాని అవి సాధారణంగా తమను తాము రక్షించుకోవడానికి లేదా వాటి గూళ్లను రక్షించడానికి మాత్రమే కుడతాయి. మగ వడ్రంగి తేనెటీగలకు కుట్టే సామర్థ్యం ఉండదు. వడ్రంగి తెనెటీగ గూళ్లను తినడానికి లేదా లార్వా కోసం వెదకడానికి చెక్కను కొడతాయి.
ఇది 94వ జీవమా?
శేషాచలం అడవులు అరుదైన ఔషధ మొక్కలతో పాటు జంతువులకు నిలయమనే విషయం జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జేఎస్ఐ) ప్రతినిధులు స్పష్టం చేశారు. 2024 డిసెంబర్లో ఒకసారి, ఈ ఏడాది మార్చి నెలలో మరోసారి జేఎస్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తద్వారా శేషాచలం అడవుల్లో 93 రకాల జంతువులు, పురుగుజాతికి చెందిన జీవజాలం ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా కనిపించిన వడ్రింగి తేనెటీగ ద్వారా 94వ జీవంగా పరిగణిస్తారా? అనేది శాస్ర్తవేత్తలు స్పష్టం చేయాల్సి ఉంది.
ఇది ఎక్కడ ఉంటుంది?
అరుదైన కీటకం వడ్రంగి తేనెటీగ ఉత్తర అమెరికా ప్రాంతంలో జంటగా కనిపిస్తుందనే విషయం పరిశోధన పత్రాలు, గూగుల్ ద్వారా స్పష్టమైందని ఎస్వీయూ ప్రొఫెసర్ హరికృష్ణ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఈ ఈగపై భాగం ఆకర్షీణీయంగా కనిపిస్తుంది. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..

"నేను దానిని తిరుపతిలోని మంచినీళ్ల గుంట సమీపంలోని శివాలయంలో కనుగొన్నాను. అది మనోహరంగా ఉంది! వడ్రంగి తేనెటీగలు నిజంగా ప్రత్యేకమైనవి. ముఖ్యమైన పుష్ప పరాగ సంపర్కాలు. తిరుపతిలోని మంచినీళ్ల గుంట సమీపంలోని శివాలయం అటువంటి జీవిని కనుగొనడం చాలా ఆనందంగా ఉంది. ఇవి సాధారణంగా ఉత్తర్ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని జాతులు మాత్రం పశ్చిమ కనుమలలో కనిపిస్తాయి. వడ్రంగి తేనెటీగలు జీవవైవిద్య పరంగా పుష్పాల పరాగసంపర్కంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తాయి. ఇవి గూడు కట్టడానికి చెక్కలో రంధ్రాలు చేసే వాటి విలక్షణమైన అలవాటుకు ప్రసిద్ధి చెందాయి" అని డాక్టర్ హరికృష్ణ వివరించారు.
ఎలా వచ్చి ఉండవచ్చు..
ఉత్తర అమెరికాలో కనిపించే ఈ వడ్రింగి తేనెటీగ ఆనవాళ్లు శేషాచలం పర్వతశ్రేణులకు సమీపంలోనే ఉన్న పశ్చిమ కనుమల్లో సంచరిస్తున్నట్లు
ఆధారాలు ఉన్నాయి అని డాక్టర్ హరికృష్ణ చెప్పారు. కర్ణాటక అటవుల్లో తరచూ కనిపించే ఈ వడ్రింగి తెనెటీగ శేషాచలం అడవులకు వచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఆ వడ్రింగి తేనెటీగలు ఎండిన చెక్కలపై జీవనచక్రం ప్రారంభిస్తాయి. వృక్షాజాతిలో పువ్వుల పుప్పొడిపై ఈ వడ్రిండి తేనెటీగ పెద్ద పాదాలు తాకగానే పరపరాగ సంపర్కం సాగించడానికి ఆస్కారం కల్పిస్తాయి" అని డాక్టర్ హరికృష్ణ వివరించారు.
"సాధారణంగా తేనెటీగలు సంఘంగా ఏర్పడి, తెనెపట్టును సృష్టిస్తాయి. ఈ వడ్రింగి తేనెటీగలు ఒకటిగా ఉండవు. జంటగా మాత్రమే సంచరిస్తంటాయి. ఇదే దీని ప్రత్యేకత" అని డాక్టర్ హరికృష్ణ విశ్లేషించారు.
Read More
Next Story