
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా మరింది. ఈ సస్పెన్స్కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 9:22 AM IST
కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది నిరసన
రాయచోటి లోని సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఖాళీ పేట్ల తో పోలింగ్ సిబ్బంది నిరసన.
అల్పాహారం కోరత వల్ల సిబ్బంది ఆగ్రహం.
సిబ్బంది సామర్థ్యం తగిన అల్పాహారం ఏర్పాటు చేయకపోవడం పై ఆగ్రహం.
- 4 Jun 2024 9:22 AM IST
కర్నూల్ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి పార్టీ నాగరాజు మొదటి రౌండ్లో 145 ఆధిక్యం.
- 4 Jun 2024 9:22 AM IST
తొలి రౌండ్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైసీపీ అభ్యర్థికి 5164,బిజెపి అభ్యర్థి కి 4419 ఓట్లు
- 4 Jun 2024 9:19 AM IST
నగిరి నియోజవర్గంలో వైసిపి అభ్యర్థి రోజాపై తెలుగుదేశం అభ్యర్థి భాను ప్రకాష్ 950 ఓట్లతో ఆధిక్యం
- 4 Jun 2024 9:17 AM IST
తిరుపతి
శ్రీకాళహస్తి పార్లమెంటరీ పోస్టల్ బ్యాలెట్లో గురుమూర్తి కి 3391
వరప్రసాదరావు 3750
వరప్రసాద్ ఆదిక్యం 359
శ్రీకాళహస్తి ఈవీఎం కౌంటింగ్ లో కూటమి ఆధిక్యం..
- 4 Jun 2024 9:15 AM IST
ఏపీ అసెంబ్లీ: 31 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాల్లో జనసేన, 3 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
- 4 Jun 2024 9:14 AM IST
కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.. కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం.. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్ల ఆధిక్యం.. రాజమండ్రి రూరల్ 3వ రౌండ్లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి 4,905 ఓట్ల ఆధిక్యం
- 4 Jun 2024 9:13 AM IST
కడపలో అవినాష్ ఆధిక్యం
కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం.. రాజమండ్రి లోక్సభ స్థానంలో 1973 ఓట్ల ఆధిర్యంలో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి.. నరసరావుపేట లోక్సభ స్థానంలో 509 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు.. నెల్లూరు లోక్సభలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి
- 4 Jun 2024 9:13 AM IST
గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యం.. అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యం, తిరుపతి లోక్సభ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి లీడ్