
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా మరింది. ఈ సస్పెన్స్కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 9:48 AM IST
గన్నవరంకు పవన్ కల్యాణ్
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో 10:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి రానున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
- 4 Jun 2024 9:47 AM IST
గుడివాడలో కొడాలి నాని వెనకంజ
కొడాలి నాని పై వెనిగళ్ళ రాము... 13085 ఓట్ల ఆదిక్యం
సంబరాలకు సిద్ధమవుతున్న తెలుగుదేశం శ్రేణులు
- 4 Jun 2024 9:46 AM IST
ఇప్పటి వరకు కౌంటింగ్ ఇలా
రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య చౌదరి లీడ్.!
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామ ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం
బొబ్బిలిలో బేబి నాయన ఆధిక్యం
తాడికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం
ముమ్మడివరలో టీడీపీ ఆధిక్యం
టెక్కలి టీడీపీ ఆధిక్యం
ఆముదాలవలస టీడీపీ ఆధిక్యం
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
తిరువూరులో కొలికపూడి ఆధిక్యం
మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యం
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యం
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యం
రాజమండ్రిలో 1800 ఓట్లతో పురంధరేశ్వరి లీడ్
నగిరిలో మంత్రి రోజా వెనుకంజ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి 2300 ఓట్లతో ఆధిక్యం.
- 4 Jun 2024 9:45 AM IST
ఇప్పటివరకు అందిన ఫలితాల్లో రాష్ట్రంలో 101 సీట్లలో టిడిపి కూటమి ఆధిక్యతలో ఉండగా, వైఎస్ఆర్సిపి 18 అసెంబ్లీ స్థానాల్లో లీడ్ లో ఉంది.
- 4 Jun 2024 9:45 AM IST
రాయలసీమలో టీడీపీదే ఆధిక్యత
రాయలసీమ లోని నాలుగు జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఇప్పటివరకు టిడిపి ఆధిక్యత కొనసాగిస్తోంది. ఈ జిల్లాలోని 52 సీట్లలో 2019 ఎన్నికల్లో మూడు స్థానాల మినహా మిగతా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుపొందారు.
- 4 Jun 2024 9:44 AM IST
స్పష్టమైన ఆధిక్య దిశగా టీడీపీ
మొదటి రౌండ్లో వైఎస్ఆర్సిపి 15, టిడిపి 90 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మొదటి రౌండు జరిగేసరికి రాష్ట్రంలో మంత్రులు ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగిరి లో ఆర్కే రోజా, గుంటూరు వెస్ట్ ల విడుదల రజిని, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, ఆముదార వలసలు స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు
- 4 Jun 2024 9:27 AM IST
కడపలోనూ టీడీపీనే ముందు
కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యం.. మొదటి రౌండ్లో 660 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ
- 4 Jun 2024 9:26 AM IST
ఏపీ అసెంబ్లీ: 45 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యం
- 4 Jun 2024 9:26 AM IST
తిరుపతి పార్లమెంటులోని వెంకటగిరి ఈవీఎం కోట్ల లెక్కింపు మొదటి రౌండు
వైసిపి గురుమూర్తి 5057
బిజెపి వరప్రసాద్ 3645
1412 గురుమూర్తి ఆధిక్యం