
తిరుమల శ్రీవారి ఆలయం
Tirumala Hundi |సిరిసంపదల దేవుడి ‘చిరు సంపద’ గలగల వింటారా?
వడ్డికాసుల వాడి నాణేల కానుకల గమ్యం ఏమిటి?
తిరుమల పేరు వినగానే అక్కడి కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. అందులో శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించే కానుకల లెక్కింపు కోసం కూడా పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థను టీటీడీ ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో చిల్లర నాణేలు జల్లెడ పట్టి వేరు చేసే చేయడం నుంచి ప్రస్తుతం జర్మనీ యంత్రాలతో తూకం వేసే స్థితికి పరిణామాలు మార్పులు జరిగాయి. ఇంతటి ఆదాయం వెనుక కూడా ఓ రహస్యం ఉంది.
కొప్పెర
1) శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి రంగాళాన్ని శ్రీవారి హుండీగా ఏర్పాటు చేయించారు. దీనికి కొప్పర అనే పేరు కూడా ఉంది.
ఆదాయం వెనుక రహస్యం...
రూ. 30 లక్షల చిల్లర నాణేలు..
తిరుమల శ్రీవారిని రోజూ కనీసంగా 65 వేల నుంచి 80 వేల మంది వరకు యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. వారి ద్వారా సగటున రోజుకు 3.50 కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్య ఆదాయం ఉంటుంది.తిరుమల శ్రీవారిని
జల్లెడ నుంచి జర్మనీ యంత్రాల వరకు..
తిరుమల శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించే కానుకలను తొలినాళ్లలో జల్లెడ, మనుషులు కానుకలు వేరు చేసేవారు. ప్రస్తుతం జర్మనీ యంత్రాలతో వేరు చేయడం వరకు మార్పులు జరిగాయి.
ప్రత్యేకతలు
పరకామణిలో బరువు నిర్ధారణ ఇలా..
పరకామణిలో నాణేలు లెక్కించడం సాధ్యం కాదు. జర్మన్ యంత్రాలతో నాణేల బరువు, సైజు ఆధారంగా విలువ నిర్ధారిస్తారు. గన్నీ బ్యాగుల్లో యంత్రాలే నింపుతాయి. అవి ఇలా..
11 బ్యాంకులకు పంపిణీ..
పరకామణి నాణేలను తిరుమల బ్యాంకుల నుంచి జిల్లాలోని మిగతా శాఖలకు అందజేస్తున్నారు. షాపింగ్ మాల్స్, చిల్లర దుకాణాలు, చిరు వ్యాపారులకు చిల్లర కొరత లేకుండా నిర్దిష్ట నాణేల బ్యాగుల్లో నాణేలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
"తిరుపతి నుంచి సూళ్లూరుపేట, తిరుపతి నుంచి నగరి వరకు ఉన్న 11 బ్యాంకులకు నాణేల బ్యాగులు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా పంపింణీ చేస్తున్నాం" అని తిరుమల ఎస్పీఐ మేనేజర్ రవికిరణ్ చెప్పారు. అయినా రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణేల కొరత ఉన్న వాతావరణం సర్వసాధారణంగా కనిపిస్తోంది.

