పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన, బాలినేని , సామినేని, కిలారి

Update: 2024-09-26 12:20 GMT

ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కీలకనేతలు ముగ్గురు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్లెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పిజనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తరలివచ్చారు.


Tags:    

Similar News