తొలగించిన వారిలో 24 లక్షల మంది చనిపోయినట్లు తేలగా, 19 లక్షల మంది వలసవెళ్లినట్లు, 12 లక్షల మంది వివరాలు సరిగాలేకపోవడం, మరో 1.3 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు.
డ్రాప్ట్ రోల్ విడుదలతో ‘సర్’ ప్రక్రియ మొదటి దశ పూర్తయినట్లు సూచిస్తుంది. మూడు దశల ప్రక్రియలో రెండో దశ ఫిబ్రవరి 2026 వరకూ కొనసాగుతుంది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దీనితో వచ్చే ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించబోతోంది. ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. పునరుద్దరణ కోరుకునే వారు ఫారమ్ 6 ద్వారా వివిధ పత్రాలతో క్లెయిమ్ లను సమర్పించవచ్చు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత తుది జాబితా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జారీ చేస్తారు. బెంగాల్ చివరగా 2002 లో ‘సర్’ నిర్వహించారు.
మొత్తం ఎన్ని లక్షలు..
ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. మొత్తం 58,20,898 ఓట్లు పేర్లు తొలగించారు. ఇందులో దాదాపు 24,16,852 మంది మరణించగా, 19,88,076 మంది శాశ్వతంగా వలసవెళ్లారు.
మరో 12,20,038 మంది ఓటర్ల వివరాలు అందలేదు. 1,38,328 ఎంట్రీలను నకిలీవిగా గుర్తించారు. మరో 57,604 పేర్లను ఇతర కారణాల కింద తొలగించారు.
డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11 మధ్య నిర్వహించిన సర్ ప్రక్రియ అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల వివరాలను తొలగించడం కఠినమైన గడువు, అధిక పని ఒత్తిడి వంటి ద్వారా బీఎల్ఓల సమ్మెతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
టీఎంసీ ఖండన..
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఎస్ఆర్ పై బెంగాల్ రాజకీయ దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ఈ జాబితాను ఖండించారు. ఎన్నికలకు ముందు లక్షలాది మంది అర్హతగల ఓటర్లను తొలగించడానికి కేంద్రం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.
ఈ నెల ప్రారంభంలో కృష్ణనగర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. జాబితాలో నుంచి ఈ పేర్లను తొలగించినట్లయితే వీధుల్లోకి రావాలని బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టారు.
‘‘మీరు ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా? వారు ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి తల్లులు, సోదరీమణులను బెదిరిస్తారు.
తల్లులు, సోదరీమణులారా, మీ పేర్లు తొలగించబడితే మీకు పనిముట్లు ఉన్నాయి? మీరు వంట చేసేటప్పుడూ ఉపయోగించేవే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగించబడితే మీరు దానిని అనుమతించొద్దు. అవునా? మహిళలు ముందు భాగంలో పోరాడాలి. పురుషుల వారి వెనక నిలబడతారు’’ అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అక్రమ ఓటర్లంటూ బీజేపీ నిప్పులు..
మమతా బెనర్జీ సర్ ను వ్యతిరేకించడం తన అక్రమ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నమని బీజేపీ ఆరోపించింది. ఆమె కాపాడుకునే ఓటు బ్యాంకులో అక్రమ వలసదారులదే మెజారిటీ అని విమర్శించింది.
‘‘మమతా బెనర్జీ చనిపోయినప్పటి నుంచి అధికారంల కోల్పోతారనే భయంతో అలజడి సృష్టిస్తున్నారు. నకిలీ, అక్రమ ఓటర్లను తొలగిస్తున్నారు. తృణమూల్ కు బీజేపీ కంటే కేవలం 22 లక్షల కంటే ఓట్ల తేడా మాత్రమే ఉంది’’ అని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు.
అంతకుముందు అధిక పని ఒత్తిడి కారణంగా బూత్ లెవల్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారని టీఎంసీ ఎన్నికల సంఘాన్ని విమర్శించింది. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ సమయంలో దాదాపు 40 మంది ఎన్నికల అధికారులు మరణించారని టీఎంసీ ఆరోపించింది ఎన్నికల సంఘం చేతులపై బీఎల్ఓల రక్తం ఉందని టీఎంసీ విమర్శించింది.