‘విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్దే’
10 సంవత్సరాల్లో విద్యావ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. 2 లక్షల 32 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు నియమించారు.;
తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనమండలిలో విద్యావ్యస్థపై చర్చ జరిగింది. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ దుర్భరంగా ఉందని, అందులో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, దానిని మళ్ళీ గాడిన పెట్టడంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, దీంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. ఉపాధ్యాయులు పుష్కలంగా ఉన్నా విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారని, విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగ నియామకాలపై ఎమ్మెల్సీ తాత మధుసూదన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్.
‘‘10 సంవత్సరాలు పరిపాలించారు. మేము 14 సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నారు. కోర్టుకు వెళ్లి నోటిఫికేషన్..రిక్యూట్మెంట్ ప్రసెస్లను ఆపేల చేసింది ఎవరు? నోటిఫికేషన్లు వేసి పేపర్ లీక్లు చేసి మళ్ళీ కోర్టు కేసులకు పోతే లాభం ఏముంది. మీకు ఉద్యోగాలు నింపాలి అని తెలంగాణ ఉద్యమంలో అదే ప్రధాన డిమాండ్ అంటే ఎందుకు చేయలేదు. ఉద్యోగాలు పోతే ఆరు నెలల్లో రాజకీయ ఉద్యోగాలు పొందారు. ఉద్యోగ నియామకాల పై ఎందుకు శ్రద్ధ పెట్టలేదు. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా పడిందా? 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క డీఎస్సీ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ లను ఎందుకు నియమించలేదు?’’ అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.
‘‘10 సంవత్సరాల్లో విద్యావ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. 2 లక్షల 32 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు నియమించారు. ప్రాసెస్ ఉంచి నోటిఫికేషన్ లు..కోర్టుల్లో ఎన్ని లిటిగేషన్లో ఉన్నవాటన్నింటిని మేము సాల్వ్ చేశాం. కుటుంబాలతో సమేతంగా పిలిచి నియామక పత్రలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇస్తుంటేము వద్దన్నమా. మీరు ఉద్యోగాలు ఇస్తుంటే జెఏసి చైర్మన్ కోదండరాం అడ్డంపడ్డారా. ఉద్యోగాలు ఇవ్వమనీ డిమాండ్ చేస్తే తలుపులు పగుల గొట్టి అరెస్టులు చేశారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ఉద్యోగ నియామకాలు చేపట్టాం. నోటిఫికేషన్ లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టేనా.. నియామకాలు చేపట్టినప్పుడా. నోటిఫికేషన్ లు మీరు ఇస్తే మేము ఏమైనా కోర్టుకు పోయామా ..? ఇష్యుస్స్ క్రియేట్ చేస్తే మేము సాల్వ్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం’’ అని తెలిపారు.