తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్

తెలంగాణలో వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ సభ్యులను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-10-21 13:28 GMT

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు జీఓఆర్టీ నంబరు 774తో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

-  రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి పాటు పడేందుకు రేవంత్ సర్కారు ఈ రైతుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది. 

- మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఛైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ సభ్యులుగా ఎం సునీల్ కుమార్ (హైదరాబాద్), రాంరెడ్డి గోపాల్ రెడ్డి (ఖమ్మం జిల్లా), గడుగు గంగాధర్ (నిజామాబాద్), కేవీ నరసింహారెడ్డి (నాగర్ కర్నూల్ జిల్లా), చెవిటి వెంకన్న యాదవ్ (సూర్యాపేట జిల్లా), మరికంటి భవానీ సభ్యులుగా నియమించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ఈ రైతు కమిషన్ పనిచేయనుంది.



 



Tags:    

Similar News