పహల్గాం ఉగ్ర దాడిపై జుమా నమాజ్ లో నిరసన

పహల్గాం బాధితులకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.ముస్లింలు జుమా నమాజ్ లో నిరసన తెలపనున్నారు.;

Update: 2025-04-25 01:18 GMT
పహల్గాం ఉగ్రదాడి ఘటన

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం సందర్భంగా జరగనున్న జుమా నమాజ్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని హైదరాబాద్ ఎంపీ,ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడి ఘటనలో బాధితులకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లింలంతా నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపడతారని చెప్పారు.ముస్లింలు దుఃఖాన్ని, ఉగ్రవాద దాడికి వ్యతిరేకతను సూచిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరిస్తారని ఎంపీ వివరించారు.




దేశ ఐక్యతను బలహీన పర్చబోం

‘‘ఉగ్రవాదులు, విదేశీ శక్తులు భారతదేశ శాంతి, ఐక్యతను బలహీన పర్చనివ్వబోమనే సందేశాన్ని మనం పంపుదాం, ఈ దాడి కారణంగా మన కశ్మీరీ సోదరులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. శత్రువుల మాయలకు బలైపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఒవైసీ పేర్కొన్నారు.పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కఠినమైన శిక్షకు అర్హులు అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించదగినది,ఈ దాడి చేసిన ఉగ్రవాదులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్ష విధించాలి’’ అని అసదుద్దీన్ కోరారు.

ఉగ్ర దాడిని ఖండించిన అసద్
మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఉరి, పుల్వామా వంటి మునుపటి దాడుల కంటే ఇది చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు.పహల్గాం దాడి ఘటన నిఘా వైఫల్యమేనని, దీనిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాన్ని తిరిగి తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు.ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీరులో అశాంతి పెరిగిందన్నారు. ‘‘మేం పహల్గాం బాధిత కుటుంబాలకు సంఘీభావంగా నిలుస్తున్నాం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ గడ్డి మైదానంలో పర్యాటకులు పోనీ రైడ్, పిక్నిక్ లతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి యూఏఈ, నేపాల్ దేశాలకు చెందిన ఇద్దరితోపాటు 26 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు.





Tags:    

Similar News