నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

నిమ్స్ ఆసుపత్రి అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ (45) సూసైడ్ చేసుకున్నారు.

By :  Vanaja
Update: 2024-07-06 07:35 GMT

నిమ్స్ ఆసుపత్రి అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ (45) సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడలోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లారు.

ప్రాచీకర్ ని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన నిమ్స్ డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటనపై ప్రాచీకర్ ఫ్యామిలీ పోలీసులకు తెలియజేశారు. వారి సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలి ఆత్మహత్యకి సంబంధించిన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. 

Tags:    

Similar News