ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్.. రంగంలోకి మెరెన్ మార్కోస్
జీరో పాయింట్ వద్దకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్స్. డేంజర్ జోన్గా చెప్తున్న రెస్క్యూ టీమ్స్. రిస్క్ తీసుకుంటే రెస్క్కూ బృందాలకు ప్రమాదం తప్పదన్న ఇంజినీర్లు.;
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో లోపల చిక్కుకున్న ఎమిది మందిని బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని మార్గాల్లోనూ వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టాస్క్ఫోర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగాయి. అయినా ఇప్పటి వరకు లోపల చిక్కుకున్నవారిని స్థితి గతులకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. వారి ఆచూకి తెలుసుకోవడం కోసం అధికారులు తలమున్కలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రమంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. రెస్క్యూ టీమ్స్తో సమావేశమవుతూ.. ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని ఆచూకి ముందుగా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అదే ‘ఆపరేషన్ మార్కోస్’.
ఈ ఆపరేషన్ చేపట్టడానికి మరికాసేపట్లు ఇండియన్ మెరెన్ కమాండో ఫోర్స్ చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా.. ఎలాంటి కృష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలను విజయవంతంగా చేపట్టే సత్తా ఈ మార్కోస్కు ఉంటుంది. ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎస్ ఇంజనీర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్లో మార్కోస్ కూడా పాలుపంచుకోనున్నారు. బోర్డర్ ఆఫ్ ఆర్గైజేషన్(బీఆర్ఓ) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృందంతో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా బాధితుల గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా మర్కోస్ రంగంలోకి దిగారు.
టన్నెల్ ప్రమాదం జరిగి 96 గంటలు గడుస్తున్నా లోపల చిక్కుకున్న వారి సంబంధించి ఎటువంటి ఆచూకీ తెలియలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, మేఘా, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్.. జీరో పాయింట్ వద్దకు చేరుకున్నాయి. కాగా 1600 టన్నుల బరువున్న టీబీఎం మిషన్ను అడ్డు తొలగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. రిస్క్ తీసుకుంటే రెస్క్కూ బృందాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతాన్ని ఇంజినీర్లు డేంజర్ జోన్గా చెప్తున్నారు. బురద, నీరు, సామాగ్రిని తొలగిస్తేనే కార్మికుల ఆచూకీని గుర్తించడం సాధమ్యమవుతుందని చెప్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసే నేర్పరితనం మార్కోస్ బృందాలకు ఉండటంతో వారినే బరిలోకి దించుకున్నారు అధికారులు.
బాధితుల శ్రేయస్సు కోసం శ్రీశైలంలో మంత్రి ప్రత్యేక పూజలు
SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగిరావాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి సందర్బంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని.. SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగి రావాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. లక్షలాది మంది రైతులు, ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకోవడం జరిగిందని తెలిపారు.