తెలంగాణను ముంచెత్తిన వరదలు
తెలంగాణలో బుధవారం అతి భారీవర్షాలతో వరదలు వెల్తువెత్తాయి.;
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో సహాయ , పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డిపేట మండలం అన్నాసాగర్ గ్రామంలోని కళ్యాణ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వద్ద ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయ చర్యలు చేపట్టింది. ఎస్డీఆర్ఎఫ్ జవాన్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదనీటిలో చిక్కుకున్న అయిదుగురిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. మరో నలుగురిని క్షేమంగా తీసుకువచ్చారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం గుంగల్ గ్రామం వద్ద ఒకరిని బాన్స్ వాడ ఫైర్ సిబ్బంది కాపాడారు.
బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ వరద హెచ్చరికలను జారీ చేసింది.మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మబబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.