సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో ప్రమాదం

భాగ్యనగరంలో పేరుగాంచిన సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

By :  Vanaja
Update: 2024-08-23 11:12 GMT

భాగ్యనగరంలో పేరుగాంచిన సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ప్రమాద తీవ్రత పెరగకముందే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News