యాదగిరిగుట్టలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంay దివ్వ విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 54 నిమిషాలకు ప్రారంభించారు.;

Update: 2025-02-23 08:05 GMT

అత్యంత వైభవంగా యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని సీఎం ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయం దివ్వ విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తిప్రపత్తులతో ప్రారంభించారు.

- ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు .




యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తైనదిగా రికార్డు నెలకొల్పింది. 50.5 అడుగుల ఎత్తు,10,759 చదరపు అడుగుల వైశాల్యం. 68 కిలోల బంగారం, 3.90 కోట్ల ఖర్చుతో ఈ స్వర్ణ గోపురాన్ని నిర్మించారు. మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేశారు.

- వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టరులో యాదగిరిగుట్ట వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి స్వర్ణ గోపురం ఆవిష్కరణ అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు.





Tags:    

Similar News