సీఎం రేవంత్‌తో NABARD ఛైర్మన్‌ భేటీ

కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని, స్వయంసహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని రేవంత్ కోరారు.;

Update: 2025-03-21 12:34 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ ఛైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వడ్డీలేని రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అంతేకాకుండా RIDF కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని రేవంత్ కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని, స్వయంసహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు.

‘‘ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచడానికి సహకరించాలి. ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులు మార్చ్ 31 లోగా ఉపయోగించుకోవాలి. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలి. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని రేవంత్ కోరారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలిని ముఖ్యమంత్రికి నాబార్డు చైర్మన్ ప్రతిపాదించారు.

Tags:    

Similar News