'రాహుల్ గాంధీకి సికింద్రాబాద్ స్టేషన్'

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యలు ఇంకా అగ్గి రాజేస్తూనే ఉన్నాయి.

By :  Vanaja
Update: 2024-08-01 13:42 GMT

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యలు ఇంకా అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. గురువారం బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా అసెంబ్లీ వేదికగా నిరసన తెలిపారు. ఉదయం సెషన్ లో సభ జరిగినంతసేపు నిల్చునే ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్ ఎదుట నిరసన తెలిపారు. సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్షల్స్ పురుష ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయటకి తరలించగా.. అసెంబ్లీ బయట కూడా ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కి తరలించారు.

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ప్రెస్ మీట్..

రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మరోసారి ఫైర్ అయ్యారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ రేవంత్‌ను నమ్ముకున్నారు.. ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, వీటి గురించి రేపు సభలో లేవనెత్తుతాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అని ఊదరగొడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. కానీ మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మాకు సీఎం క్షమాపణ ముఖ్యం కాదు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వ స్పందనే ముఖ్యం అని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

ఇంకా ఏం మాట్లాడారంటే...

అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారు

మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు

ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు

వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌లను సీఎంలుగా చూశాం

వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు

ఎస్సీ వర్గీకరణపై కోవా లక్ష్మీ మాట్లాడాలి అనుకుంటే ఆమెకు కూడా మైక్ ఇవ్వలేదు

మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదు.. గతంలో ఇలా ఎప్పుడు లేదు

స్పీకర్ కూడా మా వినతిని పట్టించుకోలేదు

అంబేద్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు.. దాన్ని కనీసం పాటించలేదు

మా పేరు తీసుకున్నపుడు మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పీ పదవి మా వల్ల పోయింది అంటున్నారు

అసెంబ్లీలో ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదు

సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు

ఈరోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు

సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు

ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎంకు నిత్యకృత్యంగా మారింది

సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిది

రాహుల్ గాంధీ రేవంత్‌ను నమ్ముకున్నారు.. ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా

సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా

మహిళలపై అత్యాచారాల గురించి రేపు సభలో లేవనెత్తుతాం

మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి

మా గురించి మేము మాట్లాడుకోం.. మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలపై ప్రభుత్వం సమాధానం గురించి పట్టుబడుతాం

ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

మా ఎమ్మెల్యేలను పోలీస్ వాహనాల్లో తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని ఖండిస్తున్నాం

ఆనవసర విషయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డికు మంచిది కాదు

పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీ మారారు.. మమ్మల్నే భట్టి టార్గెట్ చేయడం ఎందుకు

సీఎం అక్కలు అక్కలు అంటూనే పంగ నామాలు పెడుతున్నారు

మాకు సీఎం క్షమాపణ ముఖ్యం కాదు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వ స్పందనే ముఖ్యం

Tags:    

Similar News