మహిళా టెకీపై ఆటోడ్రైవర్ అత్యాచారం, సైబరాబాద్ ఐటీ జోన్‌లో కలకలం

సైబరాబాద్ ఐటీ జోన్‌లో దారుణం జరిగింది. మహిళా టెకీపై మంగళవారం తెల్లవారుజామున ఆటోడ్రైవరు, మరో యువకుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది.

Update: 2024-10-15 12:26 GMT

సైబరాబాద్ ఐటీ జోన్ లో మంగళవారం దారుణ ఘటన జరిగింది. సోమవారం అర్దరాత్రి ఓ మహిళా టెకీ ఇంటికి వెళ్లేందుకు ఆర్ సీ పురం వద్ద ఆటో ఎక్కింది. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఆటోడ్రైవరు మసీదు బండ ప్రాంతానికి రాగానే ఆటోలోనే మహిళా టెకీపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళపై ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని ఆసుత్రికి తరలించారు.


ప్రత్యేక పోలీసు బలగాల గాలింపు
మహిళా టెకీపై ఆత్యాచారానికి పాల్పడిన ఇద్దరి నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. పరిసరాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీ సాయంతో ఆటోతోపాటు నిందితులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అర్దరాత్రి బాధిత యువతి ఆటో ఎక్కిందని పోలీసులు చెప్పారు. గతంలోనూ ఓ మహిళా టెకీని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి వదిలేశారు.ఆ ఘటన అనంతరం మళ్లీ మరో దారుణ ఘటన జరగడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

నంబరు లేని ఆటోలో దారుణం
మహిళా టెకీపై అత్యాచారం చేసిన ఆటోకు నంబరు లేదని పోలీసులు గుర్తించారు. బాధిత యువతి సహయం కోసం కేకలు వేసేందుకు ప్రయత్నించగా ఆటోడ్రైవరు కత్తి చూపించి గొంతు కోస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 29 ఏళ్ల బాధిత యువతి చెన్నై నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆటో ఎక్కిందని పోలీసులు చెప్పారు.

గోనె సంచిలో బాలిక మృతదేహం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది.స్థానికుల కథనం ప్రకారం.. అదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ కుటుంబంతో సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12వతేదీన కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలిక మంగళవారం శవమై కనిపించింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News