కార్పొరేట్ సీఈఓగా మరో హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి
ట్రంప్ బెదిరించినా పెరుగుతున్న ఇండియన్ గ్లోబల్ సీఈఓలు;
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న శైలేష్ జెజురికార్ ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ &జీ) గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు.
ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న జెజురికార్, జాన్ మెల్లర్ స్థానంలో జనవరి1, 2026 లో బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్ లో చదువుకున్న అనేక మంది కార్పొరేట్ సీఈఓలు కొనసాగుతున్నారు.
వారిలో మైక్రోసాప్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముందు వరుసలో ఉన్నారు. శైలేష్ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదువుకున్నారు. ఆయన సత్యనాదెళ్ల క్లాస్ మేట్.
శైలెష్ కు క్రికెట్ అంటే మక్కువ. హైదరాబాద్ తరఫున అండర్ -17 టోర్నమెంట్ లో చురుకుగా పాల్గొన్నారు. శైలేష్ జెజురికర్ 2020 నుంచి మహీందా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సీఈఓ గా ఉన్న రాజేష్ జెజురికర్ సోదరుడు.