కేరళలో కోవిడ్ కేసులు వారంలోనే డబుల్

వారం రోజుల వ్యవధిలోనే కోవిడ్ కేసులు డబుల్ అయ్యాయి. అప్రమత్తమయిన రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.;

Update: 2025-06-04 07:51 GMT

కేరళ(Kerala)లో మళ్లీ కోవిడ్ కోరలు చాస్తోంది. బాధితుల సంఖ్య కేవలం పది రోజుల్లోనే రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. మే 26వ తేదీన 430 యాక్టివ్ కేసులు ఉండగా.. జూన్ 3 నాటికి ఆ సంఖ్య 1,416కు పెరిగింది. దీంతో పినరయి ప్రభుత్వం ఉలికిపాటుకు గురిచేసింది. ప్రజారోగ్య వ్యవస్థను అప్రమత్తం చేసింది.

‘ఆసుపత్రిల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంది..’

వైరస్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నా.. బాధితుల్లో అనారోగ్యం తీవ్రత తక్కువగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, పెరుగుదలకు అనుగుణంగా ఆసుపత్రిల్లో చేరే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కేసుల సంఖ్యతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం COVID-19 మార్గదర్శకాలను తిరిగి జారీ చేసింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరుతోంది. జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి లక్షణాలున్న వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. అయితే బహిరంగ సభలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్‌ను ఎదుర్కోడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్ని ఆసుపత్రులను ఆదేశించారు. ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడం, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

Tags:    

Similar News