‘వైట్ కాలర్’ టెర్రరిస్ట్ ల గుట్టురట్టు

దేశంలో దాడులు చేయడానికి ప్రణాళిక రచించిన వైద్యులు

Update: 2025-11-10 12:51 GMT

జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీస్ దళాలు నిర్వహించిన ఒక ప్రధాన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో ముగ్గురు వైద్యులు సహ, ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని పోలీసులు తెలిపారు. జైష్-ఏ- మహ్మద్, అన్సార్ ఘజ్వత్- ఉల్- హింద్ లతో పాటు కాశ్మీర్, హర్యానా, యూపీ రాష్ట్రాల జిహాద్ ఉన్మాదులు దేశంలో భారీ ఉగ్రవాద దాడి చేయడానికి ప్రణాళికలు రచించారు.

15 రోజుల పాటు..
అనుమానాస్పద కార్యకలాపాలపై 15 రోజుల నుంచి పోలీసులు దృష్టి సారించారు. ఇందులో జమ్మూకాశ్మీర్ కు చెందిన ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజమ్మిల్ గనై, లక్నో మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు.
ఆమె కారులో ఏకే-47 రైఫిల్ దొరికింది. ఆమెను కస్టడీ విచారణ కోసం విమానంలో శ్రీనగర్ కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిని ఎప్పుడూ అరెస్ట్ చేశారో మాత్రం పోలీసులు కచ్చితమైన వివరాలు అందించలేదు. వీరంతా ఐఎస్ఐఎస్, జైష్ ఏ మహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థల తరఫున వీరంతా కలిసి దాడులకు ప్రణాళిక రచించారు.
పోలీసులకు లభించిన 2900 కిలోల పేలుడు పదార్థంలో అమ్మోనియం నైట్రైట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉన్నాయి. వీటిలో కొంతభాగం ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజమ్మిల్ గనై గదికి అద్దెకు తీసుకుని అందులో స్టోర్ చేశారు.
వివిధ ప్రదేశాలలో దొరికిన వాటిలో చైనీస్ స్టార్ పిస్టల్, మందుగుండు సామగ్రితో కూడిన ఏకే క్రింకోవ్ రైఫిల్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్, టైమర్లు, మెటల్ షీట్లు ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ కు చెందిన ఏడు నిందితులు..
అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు జేఅండ్ కే కు చెందినవారు. శ్రీనగర్ లోని నౌగామ్ కు చెందిన ఆరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, షోపియాన్ కు చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్, గండేర్భల్ లోని వకురా ప్రాంతానికి చెందిన జమీర్ అహ్మద్ అహంగర్ అలియాస్ ముత్లాషా, పుల్వామాలోని కోయిల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్, కుల్గాంలోని వాన్ పోరా ప్రాంతానికి చెందిన డాక్టర్ అదీల్, డాక్టర్ షాహీన్ లక్నోలో నివసిస్తున్నారు.
గనై, అదిల్ ఫోన్లలో అనేక పాకిస్తానీ నంబర్లు దొరికాయాని అధికారులు తెలిపారు. అక్టోబర్ 19న శ్రీనగర్ బన్ పోరా నౌగామ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో పోలీసులు, భద్రతా దళాలను బెదిరిస్తూ జేఎం పోస్టర్లు అతికించారు. అక్కడే దర్యాప్తు ప్రారంభం అయింది.
‘‘దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ బయటపడింది. ఇందులో పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న విదేశీ హ్యండ్లర్లతో సంబంధాలున్న రాడికలైజ్డ్ నిఫుణులు, విద్యార్థులు ఉన్నారు’’ అని జేఅండ్ కే పోలీసులు తెలిపారు. ప్రొఫెషనల్, అకడమిక్ నెట్ వర్క్ ల ద్వారా నిధులు సేకరించి, వాటిని ఎన్ క్రిప్టెడ్ ఛానెల్ ను ఉపయోగిస్తోంది.
సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో ప్రొఫెషనల్ విద్యా నెట్ వర్క్ ల ద్వారా నిధులు సేకరించారు. నిందితులు వ్యక్తులను గుర్తించడం, తీవ్రవాదాన్ని ప్రేరేపించడం, వారిని ఉగ్రవాద ర్యాంక్ లలో చేర్చుకోవడం, నిధులను సేకరించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు సేకరించడం, ఐఈడీ లు తయారు చేయడంలో పాల్గొంటున్నారు’’ అని పోలీసులు తెలిపారు.
ఈ ఉగ్రవాదులు విద్యాసంబంధమైన నెట్ వర్క్ ను ముఠాగా మార్చుకుందన్నారు. దాతృత్వ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నామనే తప్పుడు నెపంతో నిధులను సేకరిస్తున్నట్లు తెలిసింది. వీరి దగ్గరి నుంచి ఆర్డీఎక్స్ దొరకలేదు. ఫరీదాబాద్ లో ఈ రోజు ఉదయం విలేకరులకు వివరణ ఇస్తూ, ఆదివారం గనై ప్రాంగణంలో దాడులు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా తెలిపారు.


Tags:    

Similar News