జగన్ అజ్ఞానానికి నిదర్శనం.. మరోసారి ఫైర్ అయిన షర్మిల

ప్రతిపక్ష హోదా కల్పించే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగన్ చర్యలు సిగ్గుచేటని అన్నారు.

Update: 2024-07-28 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ప్రతి విషయంలో షర్మిల కూడా జగనే టార్గెట్‌ మోతమోగించేస్తున్నారు. అన్ని విషయాల్లో జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన గతంలో ఇచ్చిన హామీలు మొదలు ఇప్పుడు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జగన్ చేసిన నిరసనపై కూడా ఆమె నిరాశే వ్యక్తం చేశారు. గతంలో వివేకానంద రెడ్డి మరణించినప్పుడు ఆయన ఎందుకు నిరసన చేయలేదని ప్రశ్నించారు. అదే విధంగా వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యకు రాజీకయ రంగు ఎందుకు పులుముతున్నారని నిలదీశారు. తాజాగా తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ చేసిన డిమాండ్‌పై స్పందించారు. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం ఎంత సిగ్గు చేటు అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఘాటైన పోస్ట్ ఒకటి పెట్టారు. అందులో..

‘‘సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఇప్పుడు ఎక్కడున్నాయి.. కనపడవు, వినపడవు..! మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు.. జగన్ మోహన్ రెడ్డి. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం.

MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా?

ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని... నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే... తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!!

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని పోస్ట్ పెట్టారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Tags:    

Similar News