కలెక్టర్, ఎస్పీలకి హెల్మెట్ అక్కర్లేదా
సోషల్ మీడియాలో వైరల్ గా మారిని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ బుల్లెట్ పై ప్రయాణం ఫొటోలు.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుల్లెట్ బైక్ పై ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తిలో చేపట్టిన పనులను పరిశీలించడానికి బుధవారం ఉదయం ఇద్దరు ఉన్నతాధికారులు బుల్లెట్ పై వెళ్లారు. జిల్లా పోలీస్ ట్విటర్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఫోటోల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్ నడుపుతున్నట్టు, వెనుక సీట్ పై ఎస్పీ సతీష్ కుమార్ కూర్చున్నట్టు కనిపిస్తున్నాయి.
కానీ దీనిపైన నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రయాణించడం ఏంటని స్థానికులు, నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పేవారే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం ద్వారా సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే అధికారులు ఈ విషయంపై ఇంకా స్పందన ఇవ్వలేదు.
శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారిక సోషల్ మీడియాలో ఇలా ఉంది.