గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను తొలగించం

ఏబిసి కేటగిరీలుగా సచివాలయాలను విభజన సిబ్బంది సర్దుబాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు.;

Update: 2025-05-21 15:30 GMT

గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరినీ తొలగించ బోమని అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌కు ఇటీవల జిఓ జారీ చేశామన్నారు. సచివాలయాల ద్వారా రియల్‌ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దతామన్నారు.

సచివాలయాలను ఎబిసి అనే మూడు కేటగిరీలుగా విభజించామని ఆప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 2500 జనభా గల గ్రామ సచివాలయంలో 6గురు సిబ్బంది, 2500–3000 జనాభా గల సచివాలయాల్లో 7గురు, 3వేలకు పైన జనాభా గల సచివాలయాల్లో 8మంది మంది సిబ్బంది ఉండేలా విభజించామన్నారు. అంతేగాక క్లస్టర్‌ విధానానికి అనుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక వారి బదీలను చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమన్నారు.

అదే విధంగా త్వరలో మూడు అంచెల విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. జిల్లా, మండల, అసెంబ్లీ నియోజకర్గ స్థాయిలో ప్లానింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో జిల్లా అధికారి, మండల స్థాయిలో ఎంపిడిఓ, నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారికి కొంతమంది సిబ్బిందిని ఇచ్చి వారి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు.

Tags:    

Similar News