నెల్లూరు జిల్లాలో ఘోరం..కూలీలు మృతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.;
By : The Federal
Update: 2025-06-05 06:03 GMT
నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ చేసే పని కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో ఏడుగురు కూలీలు గాయాలపాలయ్యారు. గాయపడిన కూలీలను వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గరి కూలీల పరిస్థితి విషయంగా ఉంది.
ఈ ఘటన మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డరోడ్డు వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు కూలీలు మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.