ఇదీ ప్రభాస్ క్రేజ్... 'కింగ్' సైజ్ రీరిలీజ్ లు

---సూర్య ప్రకాష్ జోశ్యుల

By :  Admin
Update: 2024-10-19 07:12 GMT

ప్రభాస్ ..ప్రస్తుతం మన దేశంలో అతి పెద్ద స్టార్ . ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఫేజ్ నడుస్తోంది. ఈ టాప్ స్టార్ ..అక్టోబర్ 23న పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్బంగా వరస పెట్టి ఫ్యాన్స్ పండగ చేసుకునే అనేక అప్డేట్స్ రాబోతున్నాయి. ఏ స్టార్ కు జరగని విధంగా ..ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు ఈ యేడు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు మిస్టర్ ఫెరఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్,సలార్. అక్టోబర్ 23న ఉదయం ఎనిమిది గంటల నుంచీ చాలా చోట్ల షోలు ప్రారంభం కానునున్నాయి. ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ అభిమానులు చేయబోతున్నారు.

Delete Edit
అక్టోబరు 19, 20 తేదీల్లో సలార్ పార్ట్ 1 హైదరాబాద్‌లో స్పెషల్ షోలు వేయబోతున్నారు. 22న మిస్టర్ పర్ఫెక్ట్‌ని దిల్ రాజు రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బర్త్ డే నాడు ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతోంది. గతంలో రీ రిలీజ్ అయిన రెబెల్ చిత్రం 23న మరోసారి రిలీజ్ అవుతోంది. చత్రపతి, మిర్చి సినిమాలతో పాటు సాహో, రాధేశ్యామ్ సినిమాల స్పెషల్ షోలకు సన్నాహాలు చేస్తున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కర్నాటక, గుజరాత్, జపాన్ లలో ప్రభాస్ సినిమాల ప్రదర్శనలకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక‌ ఈ ఏడాది ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇక రీ రిలీజ్ లలో భాగంగా ఇప్పటికే ప్రభాస్ పలు పాత సినిమాలు గతంలో రీ రిలీజ్ అయ్యాయి. యోగి లాంటి ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసారు. కేవలం డబ్బుల కోసమే ఈ రీ రిలీజ్ లు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అయితేనేం ఫ్యాన్స్ వీటిని ఎంకరేజ్ చేయడంతో అన్ని పాత సినిమాల హక్కులు కొనుక్కొని నట్టికుమార్ వంటివారు సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు.
అలాగే వీటితో పాటు రాబోయే చిత్రం రాజా సాబ్ టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2025 వేసవిలో విడుదల అవుతుంది. మరో ప్రక్క ప్రభాస్ హను రాఘవపూడి యొక్క ఫౌజీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.
ఇ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ కూడా లైన్లో ఉంది. స్పిరిట్ , ఫౌజీతో పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ కల్కి 2898 AD సీక్వెల్‌ను ప్రారంభిస్తాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన స్పెషల్ బర్త్ డే పోస్టర్లను ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు.
స్పిరిట్ విషయానికి వస్తే...
సందీప్‌ వంగా దర్శకత్వం​లో తెరకెక్కునున్న 'స్పిరిట్‌'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారన్న చెప్పటంతో ఈ చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది. అలాగే ఈ సినిమా కథ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ముంబై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సందీప్ వంగా ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రం స్పిరిట్ స్క్రిప్టు దాదాపు పూర్తి చేసేసారు. ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైపోయింది. రెగ్యులర్ షూటింగ్ 2025లో మొదలు కానుంది.
అయితే సందీప్ వంగా అక్టోబర్ 2024లో షూట్ మొదలు పెడదామనుకున్నారు. కాని దాన్ని ఆరు నెలలు పాటు ముందుకు తోసారు. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. దానికి ప్రభాస్ సైతం ఓకే చెప్పారు.ఈ సినిమాలో సందీప్ వంగా స్పెషల్ క్యారక్టరైజషన్ డిజైన్ చెయ్యటమే కాకుండా లుక్ కూడా పూర్తిగా మార్చబోతున్నారు. ఈ మేరకు ఫొటో షూట్ లు సైతం జరిగాయి..ఐదారు రకాలుగా లుక్ లు చూసుకుని ఒకటి ఓకే చేసారు.
రెండు పాత్రల్లో ప్రభాస్
ఇక ఈ సినిమా పై షాకింగ్ అప్డేట్ ఏమిటంటే...ఈ సినిమాలో ప్రబాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. బాహబలి తర్వాత ప్రభాస్ డ్యూయల్ రోల్స్ లో కనిపించే చిత్రం ఇదే. బాహుబలిలో ఆ రెండు పాత్రలు ఎప్పుడూ కలవవు. సింగిల్ ఫ్రేమ్ లో కనపడవు. కానీ స్పిరిట్ లో రెండు పాత్రలు ఎదురు ఎదురౌతాయని తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ లు ఇద్దరూ కలిసి కనివిందు చేస్తారని తెలుస్తోంది.
ఇక ఒక ప్రభాస్ అయితే పోలీస్ గా కనిపించనున్నారు. మరో ప్రభాస్ పాత్ర ఏమిటన్నది తెలియరాలేదు. అలాగే యానిమల్ పాత్ర కన్నా హై డోస్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయని సందీప్ చెప్తున్నారు. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్..సన్నగా , కండలు తిరిగిన శరీరంతో రెడీ కానున్నారు.
Tags:    

Similar News