చంద్రబాబు నుంచి పిలుపెవరికో? టీడీపీలో ఆ నలుగురుపై చర్చ

ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కొక్కరిగా పర్సనల్ క్లాస్ లు కూడా తీసుకుంటున్నారు.ఇప్పటికే నలుగురితో మాట్లాడానని కూడా చెప్పారు.;

Update: 2025-06-30 07:57 GMT

ఏపీలో అత్యంత మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మిగతా కూటమి పార్టీలకు సూచనలు ఇస్తూనే తెలుగుదేశం పరంగా మంత్రులు,ఎమ్మెల్యేలు గీత దాటవద్దని హెచ్చరిస్తూనే వున్నారు.కొందరు ఎమ్మెల్యేలపై తరుచూ వస్తున్న ఆరోపణలతో పిలిపించి క్లాస్ తీసుకున్న చంద్రబాబు, అందరితోనూ వన్ టు వన్ మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించానని ఇప్పటికే నలుగురితో మాట్లాడానని అధినేత చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించడంపై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది.ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, మిరియాల శిరీష, కందుల నారాయణరెడ్డి,అశోక్ రెడ్డితో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది.ఆ నలుగురితో పార్టీ అధినేత చంద్రబాబు ఏమి మాట్లాడారు. ఎలాంటి సూచనలు చేశారన్నది ఆసక్తిగా మారింది.మరి తరువాత అధినేత పిలుపు ఎవరికి వస్తుందన్నది కూడా ఉత్కంఠగా మారింది.అయితే పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వారినే ముఖ్యంగా చంద్రబాబు తన వద్దకు పిలిపించి క్లాస్ తీసుకుంటున్నారా.. లేక ఒక్కరొక్కరుగా సమయాన్ని బట్టి పిలిపించుకొని మాట్లాడుతున్నారా? అన్న చర్చసాగుతోంది.
అయితే విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్మెల్యేలకు స్పష్టంగా దిశానిర్థేశం చేశారు.ప్రజా సమస్యల విషయంలో రాజీ పడేది లేదని అందరూ ప్రజలకు దగ్గరగా వుండాల్సిందేనని తేల్చి చెప్పారు.అవినీతిని , గుండాయిజాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరు ఏమిచేస్తున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉంటుందని ,పార్టీ గీత దాటితే చర్యలుంటాయని కూడా హెచ్చరించారు.ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిందని , 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
Tags:    

Similar News