టీడీపీ నేతలు వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు
నామినేటెడ్ పోస్టుల భర్తీ జాప్యానికి నేతలే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు.;
తాను ఎప్పుడో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని భావించా. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలనుకున్నా. కానీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు దీని మీద స్పందించడం లేదని, అందువల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం లేక పోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల మీద చంద్రబాబు నాయుడు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్ట పడి పని చేసిన నాయకుల పేర్లతో కూడిన జాబితాను పంపించాలని చాలా రోజుల క్రితేమ నాయకులకు చెప్పానని కానీ ఇంత వరకు ప్రజా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని, జాబితాలను పంప లేదని అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల ఇస్తామన్నారు. అలాంటి వారి వివరాలను పంపాలని కోరినా ఇంత వరకు పంపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.