లిక్కర్ స్కాం కేసులో తండ్రితో పాటు తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై సిట్ అధికారులు దృష్టి;

Update: 2025-06-23 07:32 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో తండ్రితో పాటు తనయుడి పేరు చేరింది.లిక్కర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మూడురోజుల క్రితం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేయగా , ఇప్పుడు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రపై లోతుగా విచారణ కొనసాగిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా మోహిత్ రెడ్డికి నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డిని ఏ39గా పేర్కొంటూ సెట్ నోటీసులిచ్చింది.బుధవారం తమ ఎదుటహాజరవ్వాలని స్పష్టం చేసింది.దీంతో ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.తన తండ్రి అరెస్ట్ తరువాత సిట్ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తూ మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు.
చెవిరెడ్డి అరెస్టు , మోహిత్ రెడ్డికి నోటీసులతో తిరుపతి నియోజకవర్గ రాజకీయాలో తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన లిక్కర్ కేసులో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి, పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Similar News