‘సెర్ప్’కి నేటితో 25ఏళ్లు
తొలుత వెలుగు పేరుతో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. తర్వాత సెర్ప్గా రూపాంతరం చెందిందని సీఎం చంద్రబాబు అన్నారు.;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెర్ప్కు నాంది పలికారు. గ్రామాల ఆర్థిక అభివృద్ధి కోసం, గ్రామాల్లోని పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకించి గ్రామీణ పేదరిక నిర్మూలన పేరుతో సెర్ప్ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందించారు. తొలుత వెలుగు పేరుతో స్టార్ట్ చేశామని, తర్వాత అది సెర్ప్గా రూపాంతరం చెందందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు, సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యం. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన… pic.twitter.com/6BYphbCPDj
— N Chandrababu Naidu (@ncbn) June 16, 2025