ఆపరేషన్ సింధూర్కు ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ
‘అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ ఉద్యోగులు పెద్దఎత్తున నినదించారు.;
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద ధళాల సారధ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు మద్ధత్తుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకూ ఈసంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26మంది అమాయక పర్యాటకులను అతికిరాతకంగా కాల్చిచంపిన నేపధ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిద దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. ఆ తదుపరి భారత్–పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పాక్ కవ్వింపు చర్యలను మన దేశ త్రివిద దళాలకు చెందిన సైనికులు గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున సమర్ధవంతంగా తిప్పి కొట్టడం జరుగుతోంది.