కర్నూలులో ప్రధాని మోదీ ప్రారంభించే కార్యక్రమాలివే
రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ. 13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా.. ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని. రూ. 9449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తుండగా... రూ. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇక రూ. 2276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు.
కార్యక్రమాల వివరాలివి
విద్యుత్ ట్రాన్సమిషన్ వ్యవస్థకు – శంకుస్థాపన – రూ. 2886 కోట్లు
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – శంకుస్థాపన - రూ. 4922 కోట్లు
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – శంకుస్థాపన - రూ. 493 కోట్లు
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – శంకుస్థాపన - రూ. 184 కోట్లు
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి -శంకుస్థాపన - రూ. 964 కోట్లు
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు ప్రారంభం - రూ. 82 కోట్లు
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు ప్రారంభం – రూ. 286 కోట్లు
కనిగిరి బైపాస్ రోడ్ ప్రారంభం - రూ. 70 కోట్లు
గుడివాడ-నూజెండ్ల వద్ద 4-లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రారంభం – రూ. 98 కోట్లు
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు ప్రారంభం – రూ. 13 కోట్లు
పీలేరు నుండి కలసూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్ ప్రారంభం - రూ. 593 కోట్లు
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రారంభం - రూ. 362 కోట్లు
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం – రూ. 200 కోట్లు
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను జాతికి అంకితం – రూ. 546 కోట్లు
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ జాతికి అంకితం - రూ. 1730 కోట్లు
ప్రధాని పర్యటన ఇలా
ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వారా కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.