పవన్ కల్యాణ్ను అవమానించారు..అరెస్టు చేయండి
సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అవమానకరంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులు.;
శనివారం వైజాగ్ ఆర్కే బీజ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను అవమానిస్తూ, అసభ్యకరంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ మేరకు పిఠాపురం పోలీసు స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదులు చేశారు. పవన్ కల్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివారం పిఠాపురం టౌన్ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదులో జనసేన నాయకులు కోరారు. యోగా డే సందర్భంగా నిర్వహించిన యోగాలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్న డీసీఎం అంటూ పవన్ కల్యాణ్ స్థానంలో మార్ఫింగ్ చేసిన కుక్క ఫొటో పెట్టారని, ఇది పవన్ కల్యాణ్ను అవమానించడమే అని, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని, ర్యాండమ్ఫారెస్ట్తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ పోస్టులు పెట్టారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు పోలీసులను కోరారు.