పవన్‌ కల్యాణ్‌ను అవమానించారు..అరెస్టు చేయండి

సోషల్‌ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై అవమానకరంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులు.;

Update: 2025-06-22 08:31 GMT

శనివారం వైజాగ్‌ ఆర్కే బీజ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అవమానిస్తూ, అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ మేరకు పిఠాపురం పోలీసు స్టేషన్‌లో జనసేన నాయకులు ఫిర్యాదులు చేశారు. పవన్‌ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివారం పిఠాపురం టౌన్‌ పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో జనసేన నాయకులు కోరారు. యోగా డే సందర్భంగా నిర్వహించిన యోగాలో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి యోగా చేస్తూ రిలాక్స్‌ అవుతున్న డీసీఎం అంటూ పవన్‌ కల్యాణ్‌ స్థానంలో మార్ఫింగ్‌ చేసిన కుక్క ఫొటో పెట్టారని, ఇది పవన్‌ కల్యాణ్‌ను అవమానించడమే అని, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని, ర్యాండమ్‌ఫారెస్ట్‌తో పాటు పలు సోషల్‌ మీడియా ఖాతాల నుంచి ఈ పోస్టులు పెట్టారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు పోలీసులను కోరారు.

శనివారం విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్‌ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సీఎంతో కలిసి ఆహ్వానించారు. చంద్రబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్‌ మోదీని సత్కరించారు. యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే దానిని ప్రపంచ వాపితం చేసింది ప్రధాని మోదీ అని, సనాతన ధర్మాన్ని, దాని విశిష్టతను కూడా ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారంటూ వేదిక పై నుంచి రెండు నిముషాల పాటు యోగాను ఉద్దేశించి ప్రసంగించారు.
Tags:    

Similar News